బాలీవుడ్ కొత్త ఏడాదిలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తుస్సుమనిపిస్తున్నాయి. వేసవిలో బాక్సాఫీస్ను కళకళలాడిస్తాయనుకున్న బడేమియా చోటేమియా, మైదాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ లేవు. కానీ ‘మైదాన్’కు మంచి టాక్ ఉన్నా వసూళ్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
మరోవైపు వేరే బాలీవుడ్ స్టార్ల కొత్త సినిమాల మీద కూడా బాలీవుడ్కు పెద్దగా ఆశల్లేవు. గత ఏడాది మూడు చిత్రాలతో పలకరించిన షారుఖ్ ఖాన్ నుంచి ఈ ఏడాది కొత్త చిత్రం రిలీజయ్యేలా లేదు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ల సినిమాలూ ఈ ఏడాది రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మిగతా స్టార్ల మీద ఆశలు అంతంతమాత్రమే.
ఈ నేపథ్యంలో నార్త్ బాక్సాఫీస్ ఆశలు సౌత్ సినిమాల మీదే నిలిచి ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వచ్చే దక్షిణాది చిత్రాలే తమ బాక్సాఫీస్ను పోషిస్తాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశతో ఉన్నారు. ఇక ముందు రాబోయే చిత్రాల్లో వారి తొలి ఆశ ప్రభాస్ మూవీ ‘కల్కి’నే. ఆ చిత్రం జూన్ నెలాఖర్లో వస్తుందంటున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో విడుదల కానుంది. నార్త్లో టాప్ బాలీవుడ్ స్టార్ల సినిమాల స్థాయిలో అది రిలీజవుతుంది.
ఇక ఆగస్టులో విడుదల కానున్న ‘పుష్ప-2’ మీద హిందీలో ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇంకా రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ మూవీ ‘దేవర’, సూర్య చిత్రం ‘కంగువ’ మీద కూడా నార్త్ ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో బాలీవుడ్ బాక్సాఫీస్ను సౌత్ సినిమాలే బతికించేలా కనిపిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…