బాలీవుడ్ కొత్త ఏడాదిలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తుస్సుమనిపిస్తున్నాయి. వేసవిలో బాక్సాఫీస్ను కళకళలాడిస్తాయనుకున్న బడేమియా చోటేమియా, మైదాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ లేవు. కానీ ‘మైదాన్’కు మంచి టాక్ ఉన్నా వసూళ్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
మరోవైపు వేరే బాలీవుడ్ స్టార్ల కొత్త సినిమాల మీద కూడా బాలీవుడ్కు పెద్దగా ఆశల్లేవు. గత ఏడాది మూడు చిత్రాలతో పలకరించిన షారుఖ్ ఖాన్ నుంచి ఈ ఏడాది కొత్త చిత్రం రిలీజయ్యేలా లేదు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ల సినిమాలూ ఈ ఏడాది రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మిగతా స్టార్ల మీద ఆశలు అంతంతమాత్రమే.
ఈ నేపథ్యంలో నార్త్ బాక్సాఫీస్ ఆశలు సౌత్ సినిమాల మీదే నిలిచి ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వచ్చే దక్షిణాది చిత్రాలే తమ బాక్సాఫీస్ను పోషిస్తాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశతో ఉన్నారు. ఇక ముందు రాబోయే చిత్రాల్లో వారి తొలి ఆశ ప్రభాస్ మూవీ ‘కల్కి’నే. ఆ చిత్రం జూన్ నెలాఖర్లో వస్తుందంటున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో విడుదల కానుంది. నార్త్లో టాప్ బాలీవుడ్ స్టార్ల సినిమాల స్థాయిలో అది రిలీజవుతుంది.
ఇక ఆగస్టులో విడుదల కానున్న ‘పుష్ప-2’ మీద హిందీలో ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇంకా రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ మూవీ ‘దేవర’, సూర్య చిత్రం ‘కంగువ’ మీద కూడా నార్త్ ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో బాలీవుడ్ బాక్సాఫీస్ను సౌత్ సినిమాలే బతికించేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 24, 2024 5:57 am
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…
టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…
భావం మంచిదే అయినా.. మాట తీరు కూడా.. అంతే మంచిగా ఉండాలి. మాటలో ఏ చిన్న తేడా వచ్చినా.. భావం…
హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని క్రమంగా మన దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు.…
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల…