స్లండాగ్ మిలియనీర్ ద్వారా బాలనటుడిగా పరిచయమైన దేవ్ పటేల్ దర్శకుడిగా మారి తీసిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సంచలన కంటెంట్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మన దేశంలో రిలీజ్ కాలేదు కానీ ఓవర్సీస్ లో దీనికి మంచి రెస్పాన్స్ రావడమే కాక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఏప్రిల్ లో ఇండియా విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ సెన్సార్ అడ్డంకుల వల్ల కుదరలేదు. మన ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తీసే కొన్ని అంశాలు ఉండటంతో లేనిపోని సమస్యలు వస్తాయనే కారణంతో పెద్ద ఎత్తున కత్తిరింపులు రికమండ్ చేశారని టాక్.
ఇదిలా సాగుతూ ఉండగానే హఠాత్తుగా మంకీ మ్యాన్ ఓటిటిలోకి వచ్చేసింది. అలా అని వెంటనే ఎందులో అని వెతికేయకండి. ఇంకో ట్విస్టు ఉంది. డిజిటల్ వెర్షన్ కేవలం యుఎస్, యుకె తదితర దేశాల ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్, యాపిల్ లాంటి మాధ్యమాల ద్వారా రెంటు కట్టి చూసే ఆప్షన్ ని అందించింది. ఒకవేళ మనం డబ్బులు కట్టి చూడాలన్నా అవకాశం లేదు. ఎందుకంటే సెన్సార్ పూర్తవ్వని సినిమా కాబట్టి. అయినా మనోళ్లు ఊరుకుంటారా. ఆన్ లైన్ సైట్ల ద్వారా హెచ్డి వెర్షన్ ని వెతికి మరీ చూసేస్తున్నారు. కొత్త సినిమాలకే తప్పని పైరసీ దీన్ని వదులుతుందా.
చూస్తుంటే మంకీ మ్యాన్ ఇక్కడికి రావడం అనుమానంగానే ఉంది. హనుమాన్ జయంతి రోజే దీని డిజిటల్ వెర్షన్ రావడం గమనించాల్సిన విషయం. కథ విషయానికి వస్తే యాతన అనే నగరంలో కోతి ముఖాన్ని పోలిన మాస్కు వేసుకుని హీరో రాత్రిళ్ళు మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటాడు. వేశ్య అయిన ఓ అమ్మాయిని కాపాడే క్రమంలో పోలీసులతో తగవు తెచ్చుకుంటాడు. ఇతని చర్యల వెనుక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. వివాదాస్పదం అనిపించే విషయాలు బోలెడున్నాయి. చూడాలి మరి ఈ కోతి మనిషిని మన థియేటర్లలో చూపిస్తారో లేక స్మార్ట్ స్క్రీన్ కి పరిమితం చేస్తారో.
This post was last modified on April 23, 2024 7:28 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…