నిర్మాతల కుటుంబం నుంచి వచ్చినా మంచి స్టార్ గా ఆశిష్ ని తీర్చిదిద్దాలనేది దిల్ రాజు పెట్టుకున్న గోల్. దానికోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. డెబ్యూ మూవీ రౌడీ బాయ్స్ ని ఎంత భారీ బడ్జెట్ తో తీశారో గుర్తున్న విషయమే. అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఒప్పించడం, దేవిశ్రీప్రసాద్ తో సంగీతం ఇప్పించడం, వీళ్లిద్దరితో పాటు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి టీమ్ ని సెట్ చేసుకోవడం ఇలా చాలానే చేశారు. కానీ కాలేజీ బ్యాచుల మధ్య పాత ప్రేమదేశం ఫార్ములాని వాడిన దర్శకుడు హర్ష కొనుగంటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే దిల్ రాజు మరోసారి ప్రేక్షకులకు ఆశిష్ ని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో రౌడీ బాయ్స్ ని ఎల్లుండి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసి షాక్ తిన్న వాళ్ళే ఎక్కువ. పెద్దగా ఆడని సినిమాను ఇప్పుడెందుకు తెస్తున్నారని. ఇక్కడో వ్యూహం ఉంది. రౌడీ బాయ్స్ ని ఎంపిక చేసిన ఎస్వివి మల్టీప్లెక్సుల్లో కేవలం 50 రూపాయల టికెట్ తో చూపించబోతున్నారు. మంచి లగ్జరి అనుభూతిని ఇంత తక్కువ ధరంటే యూత్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీని వల్ల కలెక్షన్లు రాకపోయినా జనం నిండిన థియేటర్లలో ఆశిష్ ని మరోసారి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయొచ్చు. ప్రస్తావించాల్సిన ఇంకో పాయింట్ ఉంది.
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఆశిష్ రెండో మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్ 25న రిలీజయ్యేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ తో పాటు ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకు వాయిదా వేశారు దిల్ రాజు. నిజానికి దీని కన్నా ముందు ప్రారంభమైన సెల్ఫిష్ కు సుకుమార్ పర్యవేక్షణ ఉన్నా అవుట్ ఫుట్ సరిగా రావడం లేదనే కారణంతో పెండింగ్ లో ఉంచిన దిల్ రాజు లవ్ మీ కోసం కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆశిష్ కెరీర్ కోసం ఆయన ఎంతగా తపించిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ లా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇదంతా.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…