నిర్మాతల కుటుంబం నుంచి వచ్చినా మంచి స్టార్ గా ఆశిష్ ని తీర్చిదిద్దాలనేది దిల్ రాజు పెట్టుకున్న గోల్. దానికోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. డెబ్యూ మూవీ రౌడీ బాయ్స్ ని ఎంత భారీ బడ్జెట్ తో తీశారో గుర్తున్న విషయమే. అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఒప్పించడం, దేవిశ్రీప్రసాద్ తో సంగీతం ఇప్పించడం, వీళ్లిద్దరితో పాటు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి టీమ్ ని సెట్ చేసుకోవడం ఇలా చాలానే చేశారు. కానీ కాలేజీ బ్యాచుల మధ్య పాత ప్రేమదేశం ఫార్ములాని వాడిన దర్శకుడు హర్ష కొనుగంటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే దిల్ రాజు మరోసారి ప్రేక్షకులకు ఆశిష్ ని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో రౌడీ బాయ్స్ ని ఎల్లుండి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసి షాక్ తిన్న వాళ్ళే ఎక్కువ. పెద్దగా ఆడని సినిమాను ఇప్పుడెందుకు తెస్తున్నారని. ఇక్కడో వ్యూహం ఉంది. రౌడీ బాయ్స్ ని ఎంపిక చేసిన ఎస్వివి మల్టీప్లెక్సుల్లో కేవలం 50 రూపాయల టికెట్ తో చూపించబోతున్నారు. మంచి లగ్జరి అనుభూతిని ఇంత తక్కువ ధరంటే యూత్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీని వల్ల కలెక్షన్లు రాకపోయినా జనం నిండిన థియేటర్లలో ఆశిష్ ని మరోసారి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయొచ్చు. ప్రస్తావించాల్సిన ఇంకో పాయింట్ ఉంది.
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఆశిష్ రెండో మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్ 25న రిలీజయ్యేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ తో పాటు ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకు వాయిదా వేశారు దిల్ రాజు. నిజానికి దీని కన్నా ముందు ప్రారంభమైన సెల్ఫిష్ కు సుకుమార్ పర్యవేక్షణ ఉన్నా అవుట్ ఫుట్ సరిగా రావడం లేదనే కారణంతో పెండింగ్ లో ఉంచిన దిల్ రాజు లవ్ మీ కోసం కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆశిష్ కెరీర్ కోసం ఆయన ఎంతగా తపించిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ లా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇదంతా.
This post was last modified on April 23, 2024 2:40 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…