నిర్మాతల కుటుంబం నుంచి వచ్చినా మంచి స్టార్ గా ఆశిష్ ని తీర్చిదిద్దాలనేది దిల్ రాజు పెట్టుకున్న గోల్. దానికోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. డెబ్యూ మూవీ రౌడీ బాయ్స్ ని ఎంత భారీ బడ్జెట్ తో తీశారో గుర్తున్న విషయమే. అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఒప్పించడం, దేవిశ్రీప్రసాద్ తో సంగీతం ఇప్పించడం, వీళ్లిద్దరితో పాటు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి టీమ్ ని సెట్ చేసుకోవడం ఇలా చాలానే చేశారు. కానీ కాలేజీ బ్యాచుల మధ్య పాత ప్రేమదేశం ఫార్ములాని వాడిన దర్శకుడు హర్ష కొనుగంటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే దిల్ రాజు మరోసారి ప్రేక్షకులకు ఆశిష్ ని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో రౌడీ బాయ్స్ ని ఎల్లుండి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసి షాక్ తిన్న వాళ్ళే ఎక్కువ. పెద్దగా ఆడని సినిమాను ఇప్పుడెందుకు తెస్తున్నారని. ఇక్కడో వ్యూహం ఉంది. రౌడీ బాయ్స్ ని ఎంపిక చేసిన ఎస్వివి మల్టీప్లెక్సుల్లో కేవలం 50 రూపాయల టికెట్ తో చూపించబోతున్నారు. మంచి లగ్జరి అనుభూతిని ఇంత తక్కువ ధరంటే యూత్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీని వల్ల కలెక్షన్లు రాకపోయినా జనం నిండిన థియేటర్లలో ఆశిష్ ని మరోసారి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయొచ్చు. ప్రస్తావించాల్సిన ఇంకో పాయింట్ ఉంది.
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఆశిష్ రెండో మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్ 25న రిలీజయ్యేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ తో పాటు ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకు వాయిదా వేశారు దిల్ రాజు. నిజానికి దీని కన్నా ముందు ప్రారంభమైన సెల్ఫిష్ కు సుకుమార్ పర్యవేక్షణ ఉన్నా అవుట్ ఫుట్ సరిగా రావడం లేదనే కారణంతో పెండింగ్ లో ఉంచిన దిల్ రాజు లవ్ మీ కోసం కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆశిష్ కెరీర్ కోసం ఆయన ఎంతగా తపించిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ లా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇదంతా.
This post was last modified on April 23, 2024 2:40 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…