దక్షిణాది సినిమా ఎవర్ గ్రీన్ జంటల్లో సూర్య-జ్యోతికలది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి కాక్క కాక్క, సిల్లను ఒరు కాదల్ సహా ఏడు సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అన్యోన్యంగా సాగుతోంది వీరి వైవాహిక జీవితం. మధ్యలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. ఇద్దరూ విడిపోతున్నారని కొన్ని ప్రచారాలు జరిగాయి. అవేవీ నిజం కాదని తేలింది.
వివాహం తర్వాత పదేళ్లకు పైగా కుటుంబ జీవితానికే పరిమితం అయిన జ్యోతిక మళ్లీ సూర్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆయన నిర్మాణంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు వేర్వేరు చిత్రాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ సూర్యతో కూడా కలిసి నటించబోతోందట జ్యోతిక.
బెంగళూరు డేస్ లాంటి క్లాసిక్ తీసిన అంజలి దర్శకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి నటించబోెతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మరి కొందరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. సూర్య, జ్యోతిక కలిసి చివరగా ‘సిల్లను ఒరు కాదల్’ (తెలుగులో నువ్వు నేను ప్రేమ) చిత్రంలో నటించారు. ఆ సమయానికే వీళ్లిద్దరికీ పెళ్లయిపోయింది. తర్వాత కలిసి నటించలేదు.
సూర్య ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కంగువ’ షూట్ చివరి దశలో ఉంది. అది అక్టోబరులో విడుదలవుతుంది. ఇటీవలే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయింది. దీంతో పాటు వెట్రిమారన్, సుధ కొంగర చిత్రాల్లోనూ సూర్య నటించాల్సి ఉంది.
This post was last modified on April 22, 2024 2:21 pm
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…
కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే…
కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను…
జగన్కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.…