దక్షిణాది సినిమా ఎవర్ గ్రీన్ జంటల్లో సూర్య-జ్యోతికలది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి కాక్క కాక్క, సిల్లను ఒరు కాదల్ సహా ఏడు సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అన్యోన్యంగా సాగుతోంది వీరి వైవాహిక జీవితం. మధ్యలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. ఇద్దరూ విడిపోతున్నారని కొన్ని ప్రచారాలు జరిగాయి. అవేవీ నిజం కాదని తేలింది.
వివాహం తర్వాత పదేళ్లకు పైగా కుటుంబ జీవితానికే పరిమితం అయిన జ్యోతిక మళ్లీ సూర్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆయన నిర్మాణంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు వేర్వేరు చిత్రాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ సూర్యతో కూడా కలిసి నటించబోతోందట జ్యోతిక.
బెంగళూరు డేస్ లాంటి క్లాసిక్ తీసిన అంజలి దర్శకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి నటించబోెతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మరి కొందరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. సూర్య, జ్యోతిక కలిసి చివరగా ‘సిల్లను ఒరు కాదల్’ (తెలుగులో నువ్వు నేను ప్రేమ) చిత్రంలో నటించారు. ఆ సమయానికే వీళ్లిద్దరికీ పెళ్లయిపోయింది. తర్వాత కలిసి నటించలేదు.
సూర్య ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కంగువ’ షూట్ చివరి దశలో ఉంది. అది అక్టోబరులో విడుదలవుతుంది. ఇటీవలే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయింది. దీంతో పాటు వెట్రిమారన్, సుధ కొంగర చిత్రాల్లోనూ సూర్య నటించాల్సి ఉంది.
This post was last modified on April 22, 2024 2:21 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…