Movie News

మహేష్-రాజమౌళి.. కథ తెలుసన్న నిర్మాత

ఇప్పటిదాకా ఇండియాలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న రాజమౌళి-మహేష్ బాబు మూవీనే ఇండియన్ ఫిలిం హిస్టరీలో బడ్జెట్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వసూళ్ల పరంగా కూడా అది నంబర్ వన్ సినిమాగా మారడం ఖాయం.

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ లెవెల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన రాజమౌళి.. పక్కా ఇంటర్నేషనల్ మూవీలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అంటూ ఈ సినిమా గురించి ముందు నుంచి ఊరిస్తున్నాడు జక్కన్న. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్టు లాక్ అయిందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో టీం నిమగ్నమై ఉందని తెలుస్తోంది.

ఐతే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణకు గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయనకు ఈ సినిమాను రాజమౌళి చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే నారాయణ సంస్థ దుర్గా ఆర్ట్స్ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయగలరా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ నారాయణ అండ్ టీమే ఈ సినిమాను నిర్మించే విషయంలో ఏ అనుమానాలు అక్కర్లేదని.. ఆయన టీం కథా చర్చల్లో, అలాగే ప్రి ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటోందని వెల్లడైంది.

‘దుర్గా ఆర్ట్స్’లో భాగస్వామి, ఆ సంస్థ సమర్పకుడు అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి.. తాజాగా మహేష్-రాజమౌళి సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. తాను ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నానని.. కథ కూడా తనకు తెలుసని గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలు కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని.. మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని గోపాల్ రెడ్డి తెలిపారు. అంతే కాక ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

This post was last modified on April 21, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

1 hour ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

1 hour ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

4 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

4 hours ago