Movie News

మహేష్-రాజమౌళి.. కథ తెలుసన్న నిర్మాత

ఇప్పటిదాకా ఇండియాలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న రాజమౌళి-మహేష్ బాబు మూవీనే ఇండియన్ ఫిలిం హిస్టరీలో బడ్జెట్ పరంగా బిగ్గెస్ట్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వసూళ్ల పరంగా కూడా అది నంబర్ వన్ సినిమాగా మారడం ఖాయం.

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ లెవెల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన రాజమౌళి.. పక్కా ఇంటర్నేషనల్ మూవీలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అంటూ ఈ సినిమా గురించి ముందు నుంచి ఊరిస్తున్నాడు జక్కన్న. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్టు లాక్ అయిందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో టీం నిమగ్నమై ఉందని తెలుస్తోంది.

ఐతే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణకు గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయనకు ఈ సినిమాను రాజమౌళి చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే నారాయణ సంస్థ దుర్గా ఆర్ట్స్ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయగలరా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ నారాయణ అండ్ టీమే ఈ సినిమాను నిర్మించే విషయంలో ఏ అనుమానాలు అక్కర్లేదని.. ఆయన టీం కథా చర్చల్లో, అలాగే ప్రి ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటోందని వెల్లడైంది.

‘దుర్గా ఆర్ట్స్’లో భాగస్వామి, ఆ సంస్థ సమర్పకుడు అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి.. తాజాగా మహేష్-రాజమౌళి సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. తాను ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్నానని.. కథ కూడా తనకు తెలుసని గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలు కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని.. మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని గోపాల్ రెడ్డి తెలిపారు. అంతే కాక ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

This post was last modified on April 21, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

29 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

42 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago