జనాలు శతదినోత్సవాలను ఎప్పుడో మర్చిపోయారు. ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజులు బలంగా ఆడితే చాలనుకునే ట్రెండ్ లో వంద రోజుల మాట కలగా మారిపోయింది. కానీ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఈ ఫీట్ ని సాధిస్తూ ఉంటాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నువ్వా నేనాని పోటీ పడుతూ వేర్వేరు సెంటర్లలో సంవత్సరం ఆడిన రికార్డుని సంపాదించాయి. నిజంగానే రోజుకు నాలుగు షోలు ఆడించే అందుకున్నారా లేక అభిమానులు ప్రెస్టీజ్ కు వెళ్లి అది వచ్చేలా చేసుకున్నారా అనేది థియేటర్ ఓనర్లకు మాత్రమే తెలుసు.
వీటి సంగతి పక్కనపెడితే తాజాగా నిన్న గుంటూరు కారం సెంచరీ కొట్టేసింది. రెండు థియేటర్లలో హండ్రెడ్ పోస్టర్ వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని రామకృష్ణ, కర్ణాటక ముల్బాగల్ లోని నటరాజ్ లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నిజానికి గుంటూరు కరం రిలీజైన టైంలో వచ్చిన మిశ్రమ స్పందనను , హనుమాన్ పోటీని తట్టుకోలేక వెనుకబడిన వైనానికి ఇప్పుడు అందుకున్న ఘనతకు ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం మహేష్ పేరు మీద ఆయా ప్రాంతాల్లో కొన్ని మైలురాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఫ్యాన్స్ ఆడించారని ఇతర హీరోల అభిమానుల కామెంట్.
ఏది నిజమో ఏది అబద్దమో తేల్చి చెప్పలేం కానీ ఏదైతేనేం అంతగా ఆడలేదనుకున్న గుంటూరు కారం పేరు మీద వంద రోజుల స్టాంప్ పడటం సంతోషకరమే. నెట్ ఫ్లిక్స్ లో సినిమా, యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి పాట, ఇటీవలే శాటిలైట్ ఛానల్ లో జరిగిన ప్రీమియర్ వీటన్నింటిలో రెస్పాన్స్ గమనిస్తే మహేష్ బాబు బ్రాండ్ ఎంత బలంగా పని చేసిందో అర్థమవుతుంది. కొంచెం అటుఇటుగా ఉందని తెలిసినా కూడా ఒక్కసారైనా ఖచ్చితంగా చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడటం రేంజ్ ని సూచిస్తోంది. ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనక పూర్తి అంచనాలు అందుకుని ఉంటే అరాచకం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.
This post was last modified on April 21, 2024 6:46 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…