మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్స్ లో విక్రమార్కుడుది ప్రత్యేక స్థానం. వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా చూస్తున్న ప్రతిసారి మంచి కిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని తెరకెక్కించిన తీరు పలు భాషల్లో రీమేక్ అయ్యేదాకా వెళ్ళింది. విక్రమార్కుడు 2 కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత కెకె రాధామోహన్ మరోసారి దీని ప్రస్తావన తెచ్చారు. హిందీలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన రుస్లాన్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని త్వరలోనే తీస్తానని అన్నారు. దీంతో పాటు భజరంగి భాయ్ జాన్ కొనసాగింపు కూడా వేరే బ్యానర్ లో వస్తుందని స్పష్టం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ విక్రమార్కుడు 2 అంటే రవితేజతోనే తీయాలి. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరెవరు తీసినా పోలికల పరంగా ఇబ్బందులు వస్తాయి. సంపత్ నంది దర్శకుడిగా తీసే ప్లాన్ ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ కార్యరూపం దాల్చే సూచనలు దగ్గరలో లేవు. సాయిదుర్గ తేజ్ గాంజా శంకర్ ఆగిపోయాక సంపత్ నంది నెక్స్ట్ ఏం చేయబోయేది కన్ఫర్మ్ కాలేదు. తను ఓదెల 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సో చెప్పుకున్నంత ఈజీగా విక్రమార్కుడు 2 తెరకెక్కడం కుదరదు. రవితేజ అంగీకారంతో పాటు దీన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడిని సెట్ చేసుకోవాలి. జక్కన్న సృష్టించిన బ్రాండ్ ని అంతే బలంగా నిలబెట్టి సీక్వెల్ తీయగలిగిన వాళ్ళు కావాలి. ఇదంత సులభం కాదు. పలు ఇంటర్వ్యూలలో రవితేజ తన ఫేవరెట్ మూవీగా విక్రమార్కుడిని చెప్పుకున్నారు కానీ విక్రమ్ సింగ్ రాధోడ్ లేకుండా కేవలం అత్తిలి సత్తిబాబుతో సీరియస్ కం ఎంటర్ టైనర్ డ్రామాని సృష్టించడం సవాలే. ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో ఇద్దరు రవితేజలున్నారో లేక ఒక్కరికే పరిమితం చేశారో.
This post was last modified on April 20, 2024 10:52 am
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…