మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్స్ లో విక్రమార్కుడుది ప్రత్యేక స్థానం. వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా చూస్తున్న ప్రతిసారి మంచి కిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని తెరకెక్కించిన తీరు పలు భాషల్లో రీమేక్ అయ్యేదాకా వెళ్ళింది. విక్రమార్కుడు 2 కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత కెకె రాధామోహన్ మరోసారి దీని ప్రస్తావన తెచ్చారు. హిందీలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన రుస్లాన్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని త్వరలోనే తీస్తానని అన్నారు. దీంతో పాటు భజరంగి భాయ్ జాన్ కొనసాగింపు కూడా వేరే బ్యానర్ లో వస్తుందని స్పష్టం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ విక్రమార్కుడు 2 అంటే రవితేజతోనే తీయాలి. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరెవరు తీసినా పోలికల పరంగా ఇబ్బందులు వస్తాయి. సంపత్ నంది దర్శకుడిగా తీసే ప్లాన్ ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ కార్యరూపం దాల్చే సూచనలు దగ్గరలో లేవు. సాయిదుర్గ తేజ్ గాంజా శంకర్ ఆగిపోయాక సంపత్ నంది నెక్స్ట్ ఏం చేయబోయేది కన్ఫర్మ్ కాలేదు. తను ఓదెల 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సో చెప్పుకున్నంత ఈజీగా విక్రమార్కుడు 2 తెరకెక్కడం కుదరదు. రవితేజ అంగీకారంతో పాటు దీన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడిని సెట్ చేసుకోవాలి. జక్కన్న సృష్టించిన బ్రాండ్ ని అంతే బలంగా నిలబెట్టి సీక్వెల్ తీయగలిగిన వాళ్ళు కావాలి. ఇదంత సులభం కాదు. పలు ఇంటర్వ్యూలలో రవితేజ తన ఫేవరెట్ మూవీగా విక్రమార్కుడిని చెప్పుకున్నారు కానీ విక్రమ్ సింగ్ రాధోడ్ లేకుండా కేవలం అత్తిలి సత్తిబాబుతో సీరియస్ కం ఎంటర్ టైనర్ డ్రామాని సృష్టించడం సవాలే. ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో ఇద్దరు రవితేజలున్నారో లేక ఒక్కరికే పరిమితం చేశారో.
This post was last modified on April 20, 2024 10:52 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…