మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్స్ లో విక్రమార్కుడుది ప్రత్యేక స్థానం. వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా చూస్తున్న ప్రతిసారి మంచి కిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని తెరకెక్కించిన తీరు పలు భాషల్లో రీమేక్ అయ్యేదాకా వెళ్ళింది. విక్రమార్కుడు 2 కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత కెకె రాధామోహన్ మరోసారి దీని ప్రస్తావన తెచ్చారు. హిందీలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన రుస్లాన్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని త్వరలోనే తీస్తానని అన్నారు. దీంతో పాటు భజరంగి భాయ్ జాన్ కొనసాగింపు కూడా వేరే బ్యానర్ లో వస్తుందని స్పష్టం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ విక్రమార్కుడు 2 అంటే రవితేజతోనే తీయాలి. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరెవరు తీసినా పోలికల పరంగా ఇబ్బందులు వస్తాయి. సంపత్ నంది దర్శకుడిగా తీసే ప్లాన్ ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ కార్యరూపం దాల్చే సూచనలు దగ్గరలో లేవు. సాయిదుర్గ తేజ్ గాంజా శంకర్ ఆగిపోయాక సంపత్ నంది నెక్స్ట్ ఏం చేయబోయేది కన్ఫర్మ్ కాలేదు. తను ఓదెల 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సో చెప్పుకున్నంత ఈజీగా విక్రమార్కుడు 2 తెరకెక్కడం కుదరదు. రవితేజ అంగీకారంతో పాటు దీన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడిని సెట్ చేసుకోవాలి. జక్కన్న సృష్టించిన బ్రాండ్ ని అంతే బలంగా నిలబెట్టి సీక్వెల్ తీయగలిగిన వాళ్ళు కావాలి. ఇదంత సులభం కాదు. పలు ఇంటర్వ్యూలలో రవితేజ తన ఫేవరెట్ మూవీగా విక్రమార్కుడిని చెప్పుకున్నారు కానీ విక్రమ్ సింగ్ రాధోడ్ లేకుండా కేవలం అత్తిలి సత్తిబాబుతో సీరియస్ కం ఎంటర్ టైనర్ డ్రామాని సృష్టించడం సవాలే. ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో ఇద్దరు రవితేజలున్నారో లేక ఒక్కరికే పరిమితం చేశారో.
This post was last modified on April 20, 2024 10:52 am
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…