సోషల్ మీడియాలో ఒరిజినల్ పేరు, ఫొటో పెట్టుకుని ప్రొఫైల్స్ నడిపించేవాళ్లు ఎంతమంది ఉంటారో.. మారు పేర్లు, ఫొటోలు, బయోలతో బండి నడిపించేవాళ్లు అదే స్థాయిలో ఉంటారు. తమ ఐడెంటిటీని బయటపెట్టకపోయినా.. ఊరికే టైంపాస్ కోసం ఇక్కడ మారు పేర్లు, ఫొటోలతో ఉండేవాళ్లతో ఇబ్బందేమీ లేదు. కానీ వేరే ఉద్దేశాలతో ఫేక్ ఐడీల ద్వారా జనాలతో కనెక్టయ్యే వాళ్లతో ప్రమాదమే. సోషల్ మీడియా అంటేనే ఫేక్ వ్యవహారాలకు నెలవుగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఇక్కడి జనాలతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టుకుని చురుగ్గా ఉండే అకౌంట్లలో చాలా వరకు ఫేక్వే ఉంటున్నాయి. ఈ అకౌంట్ల నుంచి స్వీట్గా మాట్లాడుతూ.. రీచార్జిలు చేయించుకునే, డబ్బులు వేయించుకునే, ఇతర సాయాలు చేయించుకునే బ్యాచ్లు ఇక్కడ పెద్ద ఎత్తునే ఉన్నాయి.
కేవలం అందమైన అమ్మాయి ఫొటో పెడితే సరిపోదని, స్టార్ హీరోలకు కల్ట్ ఫ్యాన్ అని చెప్పుకుని ఆ హీరోల అభిమానుల్ని ఫాలోవర్లుగా మార్చుకుని.. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి పబ్బం గడుపుకునే వాళ్లు బాగా పెరిగిపోయారు ట్విట్టర్లో. ఈ తరహాలోనే అలేఖ్య అనే అమ్మాయి పేరుతో ఉన్న ఒక అకౌంట్ తాలూకు బాగోతం తాజాగా బయటికి వచ్చింది. ఆ అకౌంట్ నడుపుతున్నది ఓ అబ్బాయి. తాను పవన్ అభిమానిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, అందమైన అమ్మాయి ఫొటో పెట్టి కొందర్ని బుట్టలో వేసుకుని ఆ వ్యక్తి రీచార్జులు చేయించుకోవడం, అకౌంట్లలో డబ్బులు వేయించుకోవడమే కాదు.. ఒక వ్యక్తితో ఫోన్ కూడా కొనిపించుకున్నాడు.
ఐతే ఎలాగోలా ఆ ఫోన్ కొనిచ్చిన వ్యక్తే అతడి బాగోతాన్ని కనిపెట్టాడు. అతణ్ని ఎక్స్పోజ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. దీంతో బాధితులు ఒక్కొక్కరే బయటికి రావడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆ వ్యక్తి అకౌంట్ మూసుకుని వెళ్లిపోయాడు. ఇలా అమ్మాయిల బొమ్మలు పెట్టి, స్టార్ హీరోకు వీరాభిమానిని అని చెప్పుకుని.. ఆపై సెంటిమెంట్ స్టోరీలు చెప్పి అవసరాలు తీర్చుకునే వ్యక్తులకు కొదవే లేదు. అలాగే అమ్మాయిల ప్రొఫైల్స్తో ఆకర్షించి.. ఫాలోవర్లు పెరిగాక తర్వాత వాటిని ఫ్యాన్ పేజీలుగా మార్చి అమ్ముకునే వ్యక్తులూ ఉన్నారిక్కడ. ఈ నేపథ్యంలో నెటిజన్లు అప్రమత్తంగా లేకుంటే కష్టమే.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…