మొన్న ఏడాది ఒకే ఒక జీవితంతో మంచి హిట్టుని ఖాతాలో వేసుకున్న శర్వానంద్ త్వరలో మనమేతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చాడు. షూటింగ్ కొంత ఆలస్యమవుతూ వచ్చినప్పటికీ ఎట్టకేలకు వేసవి కానుకగా తీసుకురాబోతున్నారు. ఉప్పెన, బంగార్రాజు తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ కృతి శెట్టి మనమే మీద భారీ నమ్మకం పెట్టుకుంది. ఇవాళ టీజర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. కథను ఎక్కువగా రివీల్ చేయలేదు.
చూసేందుకు మంచివాడిలా కనిపించినా తాను మంచివాడిని కాననే నమ్మకం ఓ యువకుడిది(శర్వానంద్). సరదాగా జీవితం గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఇతని లైఫ్ లోకి ఓ అమ్మాయి(కృతి శెట్టి) వస్తుంది. పరిచయం ప్రేమగా మారే తరుణంలో ఒక బుల్లిబాబు (మాస్టర్ విక్రమ్ ఆదిత్య) ఎంట్రీ ఇస్తాడు. ఎంత అల్లరి చేస్తున్నా భరిస్తూ ఉండటం అంతు చిక్కని రహస్యంగా కనిపిస్తుంది. అసలు వాడు ఈ జంటకే పుట్టాడా లేక ఇలాంటివి అసలు సహించని కుర్రాడు ప్రియురాలితో పాటు ఆ చిన్ని డెవిల్ ని ఎందుకు భరించాడనేది తెరమీద చూడాలి. అధిక శాతం కథ ఫారిన్ లోనే జరుగుతుంది.
విజువల్స్ గట్రా చూస్తుంటే కమర్షియల్ మసాలాలు లేకుండా శ్రీరామ్ ఆదిత్య ఈసారి పూర్తిగా ఫ్యామిలీ రూటు పట్టాడు. చిన్నా పిల్లాడి సెంటిమెంట్ తో సినిమాలు కొత్తేమి కాదు కానీ ఈ మధ్య కాలంలో ఎవరూ ట్రై చేయలేదు. మిగిలిన క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు కానీ మనమేలో సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ ఇలా పెద్ద తారాగణమే ఉంది. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయకపోయినా ఖచ్చితంగా ఈ వేసవిలోనే రానుంది. ప్రభాస్ కల్కి 2898 ఏడి లాంటి ప్యాన్ ఇండియా సినిమాల తేదీలను బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు.
This post was last modified on April 19, 2024 2:03 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…