కొత్త సంవత్సరంలో హనుమాన్ తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా టిల్లు స్క్వేర్. ట్రైలర్ మీద నెగటివ్ టాక్ తో మొదలై వారం రోజులకే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద మూవీ పోటీలో ఉందని తెలిసినా బరిలో దిగి అద్భుత విజయం సాధించడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నెల రోజుల లోపే 125 కోట్ల గ్రాస్ ని దాటేసి, కొత్త రిలీజులను కాదని మరీ జనం తన కోసమే థియేటర్లకు వచ్చేలా చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ టీమ్ సక్సెసయ్యింది. ఇంకా చాలా చోట్ల వీకెండ్స్, సెలవుల్లో టిల్లు హవానే కొనసాగుతోంది. ఆదివారం వస్తే మెయిన్ స్క్రీన్స్ లో టికెట్లు దొరకడం లేదు.
ఇంత ఊపులో ఉన్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో అప్పుడే వచ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్టీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే సరిగ్గా విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ లో టిల్లు దిగుతున్నాడు. ఇది సితార సంస్థ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. రిలీజ్ కు ముందే ఏ డేట్ కి ఇవ్వాలనే కండీషన్ అగ్రిమెంట్ లో రాసుకోవడం వల్లే ఇప్పుడు మార్చడానికి లేదు. ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉంటే బహుశా వాయిదా వేసుకోమని అడిగి ఉండేవాళ్ళేమో చెప్పలేం.
ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమాలు త్వరగా డిజిటల్ లోకి వచ్చేయడంతో థియేట్రికల్ రన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫ్లాప్ అయినవి వస్తే పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలా జనం ఆదరించినవి కూడా త్వరగా ఓటిటి బాట పట్టేయడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే రిలీజ్ కు ముందే మంచి రేట్ వచ్చినప్పుడు పెట్టుబడి సేఫ్ అవ్వడం కోసం అలా చేయడం తప్పు కాదనే వాదనని కొట్టి పారేయలేం. ఇదే సితార గుంటూరు కారం సైతం 28 రోజులకే స్ట్రీమింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.
This post was last modified on April 19, 2024 10:32 am
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…
మానవ చరిత్రలో కల్లా అత్యంత గొప్ప కథ.. నిన్నటి ‘రామాయణం’ ట్రైలర్లో మేకర్స్ ఈ కథకు ఇచ్చిన ట్యాగ్ లైన్. రామాయణ…
ఏపీకి తలమానికంగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని…