Movie News

28 రోజులకే టిల్లు స్క్వేర్ డిజిటల్

కొత్త సంవత్సరంలో హనుమాన్ తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా టిల్లు స్క్వేర్. ట్రైలర్ మీద నెగటివ్ టాక్ తో మొదలై వారం రోజులకే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద మూవీ పోటీలో ఉందని తెలిసినా బరిలో దిగి అద్భుత విజయం సాధించడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నెల రోజుల లోపే 125 కోట్ల గ్రాస్ ని దాటేసి, కొత్త రిలీజులను కాదని మరీ జనం తన కోసమే థియేటర్లకు వచ్చేలా చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ టీమ్ సక్సెసయ్యింది. ఇంకా చాలా చోట్ల వీకెండ్స్, సెలవుల్లో టిల్లు హవానే కొనసాగుతోంది. ఆదివారం వస్తే మెయిన్ స్క్రీన్స్ లో టికెట్లు దొరకడం లేదు.

ఇంత ఊపులో ఉన్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో అప్పుడే వచ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్టీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే సరిగ్గా విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ లో టిల్లు దిగుతున్నాడు. ఇది సితార సంస్థ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. రిలీజ్ కు ముందే ఏ డేట్ కి ఇవ్వాలనే కండీషన్ అగ్రిమెంట్ లో రాసుకోవడం వల్లే ఇప్పుడు మార్చడానికి లేదు. ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉంటే బహుశా వాయిదా వేసుకోమని అడిగి ఉండేవాళ్ళేమో చెప్పలేం.

ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమాలు త్వరగా డిజిటల్ లోకి వచ్చేయడంతో థియేట్రికల్ రన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫ్లాప్ అయినవి వస్తే పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలా జనం ఆదరించినవి కూడా త్వరగా ఓటిటి బాట పట్టేయడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే రిలీజ్ కు ముందే మంచి రేట్ వచ్చినప్పుడు పెట్టుబడి సేఫ్ అవ్వడం కోసం అలా చేయడం తప్పు కాదనే వాదనని కొట్టి పారేయలేం. ఇదే సితార గుంటూరు కారం సైతం 28 రోజులకే స్ట్రీమింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.

This post was last modified on April 19, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago