కొత్త సంవత్సరంలో హనుమాన్ తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా టిల్లు స్క్వేర్. ట్రైలర్ మీద నెగటివ్ టాక్ తో మొదలై వారం రోజులకే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద మూవీ పోటీలో ఉందని తెలిసినా బరిలో దిగి అద్భుత విజయం సాధించడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నెల రోజుల లోపే 125 కోట్ల గ్రాస్ ని దాటేసి, కొత్త రిలీజులను కాదని మరీ జనం తన కోసమే థియేటర్లకు వచ్చేలా చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ టీమ్ సక్సెసయ్యింది. ఇంకా చాలా చోట్ల వీకెండ్స్, సెలవుల్లో టిల్లు హవానే కొనసాగుతోంది. ఆదివారం వస్తే మెయిన్ స్క్రీన్స్ లో టికెట్లు దొరకడం లేదు.
ఇంత ఊపులో ఉన్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో అప్పుడే వచ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్టీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే సరిగ్గా విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ లో టిల్లు దిగుతున్నాడు. ఇది సితార సంస్థ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. రిలీజ్ కు ముందే ఏ డేట్ కి ఇవ్వాలనే కండీషన్ అగ్రిమెంట్ లో రాసుకోవడం వల్లే ఇప్పుడు మార్చడానికి లేదు. ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉంటే బహుశా వాయిదా వేసుకోమని అడిగి ఉండేవాళ్ళేమో చెప్పలేం.
ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమాలు త్వరగా డిజిటల్ లోకి వచ్చేయడంతో థియేట్రికల్ రన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫ్లాప్ అయినవి వస్తే పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలా జనం ఆదరించినవి కూడా త్వరగా ఓటిటి బాట పట్టేయడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే రిలీజ్ కు ముందే మంచి రేట్ వచ్చినప్పుడు పెట్టుబడి సేఫ్ అవ్వడం కోసం అలా చేయడం తప్పు కాదనే వాదనని కొట్టి పారేయలేం. ఇదే సితార గుంటూరు కారం సైతం 28 రోజులకే స్ట్రీమింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.
This post was last modified on April 19, 2024 10:32 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…