కొత్త సంవత్సరంలో హనుమాన్ తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా టిల్లు స్క్వేర్. ట్రైలర్ మీద నెగటివ్ టాక్ తో మొదలై వారం రోజులకే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద మూవీ పోటీలో ఉందని తెలిసినా బరిలో దిగి అద్భుత విజయం సాధించడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నెల రోజుల లోపే 125 కోట్ల గ్రాస్ ని దాటేసి, కొత్త రిలీజులను కాదని మరీ జనం తన కోసమే థియేటర్లకు వచ్చేలా చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ టీమ్ సక్సెసయ్యింది. ఇంకా చాలా చోట్ల వీకెండ్స్, సెలవుల్లో టిల్లు హవానే కొనసాగుతోంది. ఆదివారం వస్తే మెయిన్ స్క్రీన్స్ లో టికెట్లు దొరకడం లేదు.
ఇంత ఊపులో ఉన్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో అప్పుడే వచ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్టీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే సరిగ్గా విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ లో టిల్లు దిగుతున్నాడు. ఇది సితార సంస్థ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. రిలీజ్ కు ముందే ఏ డేట్ కి ఇవ్వాలనే కండీషన్ అగ్రిమెంట్ లో రాసుకోవడం వల్లే ఇప్పుడు మార్చడానికి లేదు. ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉంటే బహుశా వాయిదా వేసుకోమని అడిగి ఉండేవాళ్ళేమో చెప్పలేం.
ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమాలు త్వరగా డిజిటల్ లోకి వచ్చేయడంతో థియేట్రికల్ రన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫ్లాప్ అయినవి వస్తే పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలా జనం ఆదరించినవి కూడా త్వరగా ఓటిటి బాట పట్టేయడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే రిలీజ్ కు ముందే మంచి రేట్ వచ్చినప్పుడు పెట్టుబడి సేఫ్ అవ్వడం కోసం అలా చేయడం తప్పు కాదనే వాదనని కొట్టి పారేయలేం. ఇదే సితార గుంటూరు కారం సైతం 28 రోజులకే స్ట్రీమింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.
This post was last modified on April 19, 2024 10:32 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…