సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి వయసు దాటిపోయినా.. ఇంకా ఏడడుగులు వేయని కొందరు స్టార్ హీరోలున్నారు. అందులో అందరి దృష్టీ ప్రధానంగా ప్రభాస్ మీదే ఉంటుంది. తన పెళ్లి గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అతడి పెళ్లి చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ ఆయన కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. ప్రభాస్ తీరు చూస్తుంటే ఇక పెళ్లి చేసుకోవడం అనుమానమే అనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ను పెళ్లి కొడుకుగా చూడాలని ఆశపడుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో ఇలాగే ఎక్కువగా పెళ్లి గురించి విపరీతమైన చర్చ జరిగి ఎంతకీ వివాహం చేసుకోని హీరోల్లో విశాల్ ఒకడు. అతను గతంలో వరలక్ష్మి శరత్కుమార్ను పెళ్లాడతాడని వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. వరలక్ష్మి ఈ మధ్యే వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.
మరోవైపు విశాల్ గతంలో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. అతను ఎప్పుడు, ఎవరిని పెళ్లాడతాడో తెలియట్లేదు. తన కొత్త చిత్రం ‘రత్నం’ ప్రమోషన్ల కోసమని హైదరాబాద్ వచ్చిన అతడితో ఓ మీడియా సంస్థ జరిపిన చిట్చాట్లో భాగంగా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. దానికతను ఊహించని రీతిలో సమాధానం ఇచ్చాడు.
ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను వివాహం చేసుకుంటానని అన్నాడు. నడిగర్ సంఘం కోసం భవనం కట్టించాక పెళ్లి చేసుకుంటానని, సంబంధిత కళ్యాణమండపంలో జరిగే తొలి పెళ్లి తనదే అని గతంలో చెప్పిన మాట గురించి ప్రస్తావిస్తే.. దానిపై ఎక్కువ స్పందించకుండా తాను ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక చేసుకుంటానని ఇంకోసారి నొక్కి వక్కాణిస్తూ తన పెళ్లి కార్డ్ మొదటగా ప్రభాస్కే ఇస్తానని చెప్పి సమాధానం దాటవేశాడు.
This post was last modified on April 18, 2024 2:33 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…