స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించేటప్పుడు వాటి మీద ఉన్న అంచనాలను మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శలు, ట్రోలింగ్ ని తట్టుకోవడం కష్టం. ఆ మధ్య గుంటూరు కారం టైంలో ఓ మై బేబీ సాంగ్ కి అభిమానులు మూకుమ్మడిగా తమన్ ని టార్గెట్ చేశారు. తిరిగి కుర్చీ మడత పెట్టి వచ్చి ఛార్ట్ బస్టర్ అయ్యాక కానీ శాంతించలేదు. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. తాజాగా ఒకప్పటి మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజాకు అదే తరహా పరిస్థితి వచ్చింది.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి విజిల్ పోడు లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చినప్పటి నుంచి దీని అవుట్ ఫుట్ మీద నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఏ మాత్రం బాగాలేదని, కేవలం విజిల్ పదాన్ని పదే పదే వాడుకుని విజయ్ తో పాడించి, ఒక బ్యాడ్ ట్యూన్ తో యువన్ శంకర్ రాజా చెడగొట్టారని ఇలా రకరకాలుగా నెగటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏకంగా ఇన్స్ టా నుంచి తన అకౌంట్ ని తాత్కాలికంగా తీసేశారు. సెర్చ్ లో కొట్టినా సరే యువన్ హ్యాండిల్ ఎక్కడా కనిపించడం లేదు.
ఇది ఫ్యాన్స్ ఆన్ లైన్ ఎదురు దాడి వల్లే జరిగిందని అతని స్నేహితుల నుంచి వినిపిస్తున్న వెర్షన్. నిజమో కాదో యువన్ స్వయంగా చెప్పలేడు కానీ తర్వాత వదిలే రెండో పాట విషయంలో మాత్రం టీమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ కేవలం రెండే సినిమాలు చేయబోతున్నాడు. వాటిలో ఈ గోట్ ఒకటి. అందుకే హైప్ అంతకంతా విపరీతంగా పెరుగుతూ పోతోంది. దాంతో సహజంగానే విజిల్ పోడు ని ఎక్కువగా ఊహించుకున్నారు. సగం అందుకున్నా ఈ సమస్య వచ్చేది కాదేమో. ఇంత జరిగినా సరే మూడు రోజులకే ఆ పాట 38 మిలియన్ల వ్యూస్ దాటడం కొసమెరుపు.
This post was last modified on April 18, 2024 1:52 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…