స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించేటప్పుడు వాటి మీద ఉన్న అంచనాలను మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శలు, ట్రోలింగ్ ని తట్టుకోవడం కష్టం. ఆ మధ్య గుంటూరు కారం టైంలో ఓ మై బేబీ సాంగ్ కి అభిమానులు మూకుమ్మడిగా తమన్ ని టార్గెట్ చేశారు. తిరిగి కుర్చీ మడత పెట్టి వచ్చి ఛార్ట్ బస్టర్ అయ్యాక కానీ శాంతించలేదు. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. తాజాగా ఒకప్పటి మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజాకు అదే తరహా పరిస్థితి వచ్చింది.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి విజిల్ పోడు లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చినప్పటి నుంచి దీని అవుట్ ఫుట్ మీద నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఏ మాత్రం బాగాలేదని, కేవలం విజిల్ పదాన్ని పదే పదే వాడుకుని విజయ్ తో పాడించి, ఒక బ్యాడ్ ట్యూన్ తో యువన్ శంకర్ రాజా చెడగొట్టారని ఇలా రకరకాలుగా నెగటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏకంగా ఇన్స్ టా నుంచి తన అకౌంట్ ని తాత్కాలికంగా తీసేశారు. సెర్చ్ లో కొట్టినా సరే యువన్ హ్యాండిల్ ఎక్కడా కనిపించడం లేదు.
ఇది ఫ్యాన్స్ ఆన్ లైన్ ఎదురు దాడి వల్లే జరిగిందని అతని స్నేహితుల నుంచి వినిపిస్తున్న వెర్షన్. నిజమో కాదో యువన్ స్వయంగా చెప్పలేడు కానీ తర్వాత వదిలే రెండో పాట విషయంలో మాత్రం టీమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ కేవలం రెండే సినిమాలు చేయబోతున్నాడు. వాటిలో ఈ గోట్ ఒకటి. అందుకే హైప్ అంతకంతా విపరీతంగా పెరుగుతూ పోతోంది. దాంతో సహజంగానే విజిల్ పోడు ని ఎక్కువగా ఊహించుకున్నారు. సగం అందుకున్నా ఈ సమస్య వచ్చేది కాదేమో. ఇంత జరిగినా సరే మూడు రోజులకే ఆ పాట 38 మిలియన్ల వ్యూస్ దాటడం కొసమెరుపు.
This post was last modified on April 18, 2024 1:52 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…