స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించేటప్పుడు వాటి మీద ఉన్న అంచనాలను మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శలు, ట్రోలింగ్ ని తట్టుకోవడం కష్టం. ఆ మధ్య గుంటూరు కారం టైంలో ఓ మై బేబీ సాంగ్ కి అభిమానులు మూకుమ్మడిగా తమన్ ని టార్గెట్ చేశారు. తిరిగి కుర్చీ మడత పెట్టి వచ్చి ఛార్ట్ బస్టర్ అయ్యాక కానీ శాంతించలేదు. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. తాజాగా ఒకప్పటి మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజాకు అదే తరహా పరిస్థితి వచ్చింది.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి విజిల్ పోడు లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చినప్పటి నుంచి దీని అవుట్ ఫుట్ మీద నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఏ మాత్రం బాగాలేదని, కేవలం విజిల్ పదాన్ని పదే పదే వాడుకుని విజయ్ తో పాడించి, ఒక బ్యాడ్ ట్యూన్ తో యువన్ శంకర్ రాజా చెడగొట్టారని ఇలా రకరకాలుగా నెగటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏకంగా ఇన్స్ టా నుంచి తన అకౌంట్ ని తాత్కాలికంగా తీసేశారు. సెర్చ్ లో కొట్టినా సరే యువన్ హ్యాండిల్ ఎక్కడా కనిపించడం లేదు.
ఇది ఫ్యాన్స్ ఆన్ లైన్ ఎదురు దాడి వల్లే జరిగిందని అతని స్నేహితుల నుంచి వినిపిస్తున్న వెర్షన్. నిజమో కాదో యువన్ స్వయంగా చెప్పలేడు కానీ తర్వాత వదిలే రెండో పాట విషయంలో మాత్రం టీమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ కేవలం రెండే సినిమాలు చేయబోతున్నాడు. వాటిలో ఈ గోట్ ఒకటి. అందుకే హైప్ అంతకంతా విపరీతంగా పెరుగుతూ పోతోంది. దాంతో సహజంగానే విజిల్ పోడు ని ఎక్కువగా ఊహించుకున్నారు. సగం అందుకున్నా ఈ సమస్య వచ్చేది కాదేమో. ఇంత జరిగినా సరే మూడు రోజులకే ఆ పాట 38 మిలియన్ల వ్యూస్ దాటడం కొసమెరుపు.
This post was last modified on April 18, 2024 1:52 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…