నార్త్ ఇండియన్ హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీల్లోకి వచ్చి ఆధిపత్యం చలాయించడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. ఇక్కడ నటించే సగం మందికి పైగా హీరోయిన్లు ఉత్తరాది నుంచి ఇక్కడికి దిగుమతి అయిన వారే. కానీ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్కు వెళ్లి అక్కడ మంచి పేరు సంపాదించడం.. అక్కడే కథానాయికలుగా స్థిరపడడం తక్కువ. త్రిష సహా ఎంతోమంది సౌత్ స్టార్ హీరోయిన్లు బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి వచ్చిన వాళ్లే.
నయనతార చాల ా లేటుగా ‘జవాన్’ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఐతే ఈ సినిమా హిట్టయినా ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. కొత్త అవకాశాలూ దక్కలేదు. అసలు సౌత్ హీరోయిన్ల మైండ్ సెట్కి బాలీవుడ్ సెట్ కాదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతోంది.
‘భీమ్లా నాయక్’తో తెలుగులో అడుగు పెట్టి బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరుసగా హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ సంపాదించిన మలయాళ బ్యూటీ సంయుక్త.. బాలీవుడ్లో అడుగు పెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆమె ముంబయిలో అడుగు పెట్టింది. ఒక పెద్ద హిందీ చిత్రం కోసం లుక్ టెస్ట్లో పాల్గొనేందుకే ఆమె అక్కడికి వెళ్లిందట. ఆమె వెంట ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ఒకరు కనిపించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సంయుక్త ఓ పేరున్న చిత్రంతోనే బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. త్వరలోనే దాని గురించి అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. ఐతే సౌత్ హీరోయిన్లకు ఏమాత్రం కలిసిరాని బాలీవుడ్లో సంయుక్త మాత్రం ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. తెలుగులో ఆమె ‘స్వయంభు’ లాంటి భారీ చిత్రంతో పాటు ఇంకో రెండు సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on April 16, 2024 6:30 pm
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…