మాములుగా ఏదైనా బిజినెస్ లో ఫెయిలయితే మనస్థాపం చెంది రోజుల తరబడి డిప్రెషన్లోకి వెళ్లే జనాలను కోకొల్లలుగా చూస్తుంటాం. సినిమాల విషయంలో కూడా అంతే. ఒక డిజాస్టర్ పడితే కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు వదులుకుని సంవత్సరాల తరబడి గ్యాప్ తీసుకున్న వాళ్ళు అన్ని భాషల్లోనూ ఉన్నారు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం తన రూటే వేరంటున్నాడు. భారీ ప్యాన్ ఇండియా మూవీస్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతూ నిర్మాతలకు కోట్ల నష్టం వస్తున్నా సరే స్పీడ్ మాత్రం తగ్గించేదేలే అంటున్నాడు. సంవత్సరానికి నాలుగు రిలీజులు ఉండేలా మూడేళ్ళకు ప్లాన్ చేసుకున్నాడు మరి.
ఇటీవలే విడుదలైన బడేమియా చోటేమియా దారుణమైన డిజాస్టర్ అందుకుంది. నిన్న సోమవారం కేవలం 2 కోట్ల నెట్ మాత్రమే వసూలు కావడం చూస్తే అవమానం అనే మాట చిన్నదే. 350 కోట్లు పెట్టామని నిర్మాతలు చెప్పుకుంటే ఇప్పటిదాకా 50 కోట్ల నెట్ దాటేందుకే ఆపసోపాలు పడుతోంది. వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టినా థియేటర్లకు జనాలు ఎగబడటం లేదు. వంద కోట్ల గ్రాస్ వస్తేనే గొప్పనేలా పరిస్థితి దిగజారుతోంది. గతంలో సామ్రాట్ పృథ్విరాజ్ లాంటి భారీ చిత్రాలు సైతం ఇదే ఫలితాన్ని అందుకున్నా ప్రొడ్యూసర్లు మాత్రం అక్షయ్ తో తీయడం మానడం లేదు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఓకే చేసిన సినిమాలు 14 దాకా ఉన్నాయి. సర్ఫిరా, సింగం అగైన్, స్కై ఫోర్స్, వెల్కమ్ టు ది జంగల్, హాలిడే 2, హౌస్ ఫుల్ 5, హేరా ఫెరి 3, మంచు విష్ణు కన్నప్ప ఇలా చెప్పుకుంటే చాంతాడంత లిస్టు పోతూనే ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించనంత మాత్రాన సినిమాలు చేయడం తగ్గించనని చెబుతున్న ఈ సీనియర్ హీరోకు గత కొన్నేళ్లలో దక్కిన పెద్ద హిట్లు సూర్యవంశీ, ఓ మై గాడ్ 2 మాత్రమే. ఇవి కాకుండా మిగిలినవన్నీ కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయాయి. అయినా సరే ఇంత వయసులో ఏ మాత్రం ఖాళీ లేకుండా పరుగులు పెట్టడం విశేషమే.
This post was last modified on April 16, 2024 2:47 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…