మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశాల్ సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో సక్సెస్ దక్కి సంవత్సరాలు గడిచిపోయాయి. మార్క్ ఆంటోనీ తమిళంలో బ్లాక్ బస్టరయ్యింది కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అందుకే రత్నం మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సింగం సిరీస్ తో సూర్యకు కమర్షియల్ స్కేల్ పెంచిన దర్శకుడు హరితో చేతులు కలిపాడు. ట్రైలర్ రొటీన్ గానే అనిపించినా అసలు కంటెంట్ వేరే లెవెల్ ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే విశాల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరలవుతున్నాయి.
కోలీవుడ్ లో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెడ్ జయింట్ ఫిలింస్. సాక్ష్యాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి నేతృత్యంలో ఇది నడుస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ ఏకఛత్రాధిపత్య ధోరణిలో ప్రవర్తిస్తోందని, పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఎవరూ ఏమీ అనలేకపోతున్నారని, మార్క్ ఆంటోనీ టైంలో చాలా ఇబ్బందులకు గురి చేశారని ఓపెన్ గా అనేశాడు. అంతే కాదు ఏప్రిల్ 26న రాబోయే రత్నంకు అడ్డంకులు సృష్టించినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చాడు. రెడ్ జయింట్ మీద ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలున్నాయి కానీ ఎవరు మీడియాకు చెప్పలేదు.
గత ఏడాది తమిళనాడులో వారసుడు టైంలో పోటీగా ఉన్న తెగింపుకు ఎక్కువ థియేటర్లు కేటాయించేడం వల్ల తనకు అన్యాయం జరిగి దిల్ రాజు చాలా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చిందని పలు కథనాలు వచ్చాయి. అప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది రెడ్ జయింటే. విశాల్ చెబుతున్న దాని ప్రకారం వాళ్ళు సృష్టిస్తున్న మోనోపోలీ వల్ల ఎందరో నిర్మాతలు రెవిన్యూ నష్టపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఇతర ప్రొడ్యూసర్లు మౌనంగా ఉన్నారేమో కానీ నేను మాత్రం పోరాడతా అంటున్నాడు విశాల్. అన్నట్టు త్వరలోనే రాజకీయ ప్రవేశం కూడా చేయబోతున్నాడు.
This post was last modified on April 16, 2024 10:09 am
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…