సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కున్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ లో విపరీతమైన బిజీతో మనకు సులభంగా దొరకడం లేదు కానీ తన మ్యూజిక్ కోసమే పడిగాపులు పడుతున్న దర్శక నిర్మాతలు ఎందరో ఉన్నారు. పది కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా ఏ మాత్రం భారంగా ఫీలవ్వని ప్రొడ్యూసర్లకు కొదవే లేదు. ప్రస్తుతం తెలుగులో అనిరుధ్ జూనియర్ ఎన్టీఆర్ దేవర, గౌతమ్ తిన్ననూరి మేజిక్ కు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్స్ గురించి యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్ వింటే ఎప్పుడెప్పుడు వస్తాయాని ఎదురుచూసేలా ఉంది.
ఇక అసలు మ్యాటర్ కొద్దాం. నిన్న విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం నుంచి మొదటి ఆడియో సింగల్ విడుదలయ్యింది. హీరోనే స్వయంగా పాడాడు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో విజిల్ పోడు అంటూ హుషారైన లిరిక్స్ గట్టిగానే ఉన్నాయి. అయితే విజయ్ ఫ్యాన్స్ ని ఇది పూర్తిగా సంతృప్తి పరచకలేకపోతోంది. ఊరికే వాయిద్యాల హోరు తప్ప ఆశించిన స్థాయిలో మెప్పించలేదని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఎప్పటి నుంచో యువన్ తోనే చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కస్టడీలోనూ ఈ ఇద్దరో కాంబో జరిగింది.
ఒకవేళ ఇదే గోట్ పాటలు అనిరుద్ రవిచందర్ కు ఇచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు అడగటంలో లాజిక్ ఉంది. ఎందుకంటే విక్రమ్, జైలర్, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు బీజీఎమ్ చేసిన హెల్ప్ అంతా ఇంతా కాదు. వేరొకరు అయ్యుంటే వాటి అవుట్ ఫుట్ గొప్పగా వచ్చేది కాదనే కామెంట్ ని కొట్టిపారేయలేం. యువన్ శంకర్ రాజా ఒకప్పుడు అదిరిపోయే పాటలు ఇచ్చాడు కానీ ఈ మధ్య తన మేజిక్ అంతగా పని చేయడం లేదు. గోట్ లోని మిగిలిన పాటలైనా అంచనాలకు తగ్గట్టు ఇవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…