రెండు రోజులుగా ఇండియాస్ లార్జెస్ట్ మల్టీప్లెక్స్ ఛైన్ పీవీఆర్కు, మలయాళ ఫిలిం ఇండస్ట్రీకి మధ్య పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో ఎక్కడా మలయాళ సినిమాలను ప్రదర్శించట్లేదు. మలయాళ డబ్డ్ వెర్షన్లను సైతం హైదరాబాద్ లాంటి చోట్ల పీవీఆర్ వాళ్లు ఆపేశారు.
మరోవైపు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇకపై తమ కంటెంట్ ఏదీ పీవీఆర్ వాళ్లకు ఇవ్వమని స్పష్టం చేసింది. దీంతో ఇది ఇరు వర్గాలకూ నష్టం చేకూర్చే పరిణామంగా భావించారు. ఐతే శనివారం సాయంత్రం ఈ వివాదం పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో తిరిగి మలయాళ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈమేరకు ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది.
థియేటర్లలో వీపీఎఫ్ ఛార్జీలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని.. ఓవైపు థియేటర్లకు రెంట్లు కడుతూ, ఇంకోవైపు వీపీఎఫ్ ఛార్జీలు కూడా భరించాలంటే నిర్మాతలకు చాలా కష్టమవుతుందని.. అందుకే సినిమాల ప్రదర్శనకు చౌకగా ఉండే వేరే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి దాన్నే థియేటర్లలో అమర్చుకోవాలని మలయాళ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. ఇందుకు పీవీఆర్ యాజమాన్యం ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే ఆ మల్టీప్లెక్సుల్లో మలయాళ సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. ఐతే ఇరు వర్గాల మధ్య చర్చల అనంతరం సమస్య పరిష్కారం అయింది. ఐతే మలయాళ ఇండస్ట్రీ కోరినట్లు కొత్త టెక్నాలజీని అమర్చుకోవడానికి పీవీఆర్ వాళ్లు అంగీకరించారా.. లేక పీవీఆర్ దారిలోకే మలయాళ ఇండస్ట్రీ పెద్దలు వచ్చారా అన్నది తెలియదు. మొత్తానికి సమస్య అయితే తాత్కాలికంగా పరిష్కారం అయింది. ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశంతో పాటు నివిన్ పౌలీ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుని ఈ సమస్య వల్ల రెండు రోజులు వసూళ్లు కోల్పోయాయి.
This post was last modified on April 13, 2024 10:46 pm
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాటలే కాదు.. ఆశలు కూడా కోటలు దాటుతున్నాయి. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో…
హిందూపురం.. టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇక్కడ టీడీపీకి ఎదురేలేదు. వరుసగా రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ఈ…
సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…
నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్…
రాజకీయాల్లో అన్ని వేళలా పంతమే పనికిరాదు. ఒక్కొక్కసారి పట్టు విడుపులు కూడా ముఖ్యమే. ఈ విషయంలో నాయకులు, పార్టీలు కూడా..…
హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్…