Movie News

పీవీఆర్ వెర్స‌స్ మాలీవుడ్.. క‌థ సుఖాంతం

రెండు రోజులుగా ఇండియాస్ లార్జెస్ట్ మ‌ల్టీప్లెక్స్ ఛైన్ పీవీఆర్‌కు, మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీకి మ‌ధ్య పెద్ద వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా పీవీఆర్ మ‌ల్టీప్లెక్సుల్లో ఎక్క‌డా మ‌ల‌యాళ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌ట్లేదు. మ‌ల‌యాళ డ‌బ్డ్ వెర్ష‌న్ల‌ను సైతం హైద‌రాబాద్ లాంటి చోట్ల పీవీఆర్ వాళ్లు ఆపేశారు.

మ‌రోవైపు మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీ కూడా ఇక‌పై త‌మ కంటెంట్ ఏదీ పీవీఆర్ వాళ్లకు ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇది ఇరు వ‌ర్గాల‌కూ న‌ష్టం చేకూర్చే ప‌రిణామంగా భావించారు. ఐతే శ‌నివారం సాయంత్రం ఈ వివాదం ప‌రిష్కారం అయిన‌ట్లు తెలుస్తోంది. పీవీఆర్ మ‌ల్టీప్లెక్సుల్లో తిరిగి మ‌ల‌యాళ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈమేర‌కు ఇరు వ‌ర్గాల మ‌ధ్య అంగీకారం కుదిరింది.

థియేట‌ర్ల‌లో వీపీఎఫ్ ఛార్జీలు మ‌రీ ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని.. ఓవైపు థియేట‌ర్ల‌కు రెంట్లు క‌డుతూ, ఇంకోవైపు వీపీఎఫ్ ఛార్జీలు కూడా భ‌రించాలంటే నిర్మాత‌ల‌కు చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని.. అందుకే సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు చౌక‌గా ఉండే వేరే టెక్నాల‌జీని అందుబాటులోకి తెచ్చి దాన్నే థియేట‌ర్ల‌లో అమ‌ర్చుకోవాల‌ని మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు కోరారు. ఇందుకు పీవీఆర్ యాజమాన్యం ఒప్పుకోలేదు.

ఈ క్ర‌మంలోనే ఆ మల్టీప్లెక్సుల్లో మ‌ల‌యాళ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఆగిపోయింది. ఐతే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌ల అనంత‌రం స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. ఐతే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ కోరిన‌ట్లు కొత్త టెక్నాల‌జీని అమ‌ర్చుకోవ‌డానికి పీవీఆర్ వాళ్లు అంగీక‌రించారా.. లేక పీవీఆర్ దారిలోకే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌చ్చారా అన్న‌ది తెలియ‌దు. మొత్తానికి స‌మ‌స్య అయితే తాత్కాలికంగా ప‌రిష్కారం అయింది. ఫాహ‌ద్ ఫాజిల్ న‌టించిన ఆవేశంతో పాటు నివిన్ పౌలీ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుని ఈ స‌మ‌స్య వ‌ల్ల రెండు రోజులు వ‌సూళ్లు కోల్పోయాయి.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

10 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

10 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

40 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

44 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago