ఒక కొత్త కాన్సెప్ట్తో ఓ సినిమా బాగా ఆడిందంటే చాలు.. ఇక వరుసగా ఆ తరహాలో సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటారు. ఐతే ఒక జానర్ను ఫాలో అయితే ఓకే కానీ.. కాన్సెప్ట్ను యాజిటీజ్ దించేస్తేనే సమస్య. అలా చేసినపుడు ముందు వచ్చిన సినిమాతో పోల్చి చూస్తారు. దానికి దీటుగానో, అంతకంటే మెరుగ్గానో ఉంటే ఓకే. కానీ ముందు వచ్చిన సినిమాను ఎంత మాత్రం మ్యాచ్ చేసేలా కొత్త చిత్రం లేకపోతే ప్రేక్షకులు దాన్ని తిప్పికొడతారు.
ఇప్పుడు ‘డియర్’ అనే సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన చిత్రమిది. తెలుగమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించింది. ఇందులో హీరోయిన్కు గురక సమస్య ఉంటుంది. దాని వల్ల హీరో ఎలా ఇబ్బంది పడ్డాడు.. ఇది వారి వివాహ బంధానికే ఎలా సమస్యగా పరిణమించింది అన్నది కథ.
ఐతే సేమ్ కాన్సెప్ట్తో ఆల్రెడీ ‘గుడ్ నైట్’ అనే సినిమా వచ్చింది. ‘ట్రూ లవర్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మణికందన్ హీరోగా నటించాడు. మీథా రఘునాథ్ అనే కొత్తమ్మాయి కథానాయిక. అందులో హీరోకు గురక సమస్య ఉంటుంది. దాని వల్ల రోజువారీ జీవితంలో అతను పడే ఇబ్బందులు.. పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలను చాలా హృద్యంగా చూపించారా సినిమాలో. మంచి ఫీల్తో సాగడంతో పాటు ఎమోషనల్గానూ ప్రేక్షకులను కదిలిస్తుందా సినిమా.
ఎంటర్టైన్మెంట్కు కూడా అందులో లోటు లేదు. కానీ ‘డియర్’ ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా నిలవదు. ఇటు ఎంటర్టైన్మెంటూ లేక, అటు ఎమోషన్లూ పండక ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందా సినిమా. సేమ్ కాన్సెప్ట్తో ముందే ఓ సినిమా వచ్చి హిట్టయినపుడు ‘డియర్’ టీం జాగ్రత్తపడాల్సింది. ఈ సినిమా రిలీజై ఏడాది కావస్తోంది. అది చూశాక సినిమా భిన్నంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది. లేదా మొత్తంగా సినిమానే ఆపేసి ఉండాల్సింది. అలా కాకుండా సాధారణంగా తీసి ప్రేక్షకుల మీదికి వదిలేశారు. ఫలితంగా నిట్టూర్పులు తప్పట్లేదు.
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…