నవ్వు నాలుగు విధాలా చేటని పెద్దలు ఊరికే అనలేదు. సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించకుండా తొందరపడితే ఒక్కోసారి పరిణామాలు దూరం వెళ్లిపోతాయి. అలాంటిదే ఈ సంఘటన. కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ తెలుసుగా. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరసగా రెండు భారీ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఇతని సొంతం. కాకపోతే ఆ రెండూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం విచారకరం. దళిత భావజాలాన్ని, ఆ వర్గం మనుగడని కోరుకునే పా రంజిత్ తన ఆలోచనలను తెరమీద చూపిస్తూ ఉంటాడు. రజని అయినా సరే వాటిని అంగీకరించే స్థాయిలో కథలు రాసుకుంటాడు.
ఇటీవలే పా రంజిత్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. తమిళనాడు రాజకీయ పరిణామాలు ప్రధాన అజెండా. వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడుతూ కాలాలో రజనీకాంత్ రాజకీయాల కుళ్ళు గురించి గొప్పగా చెప్పాడని, వాటి అర్థం తెలియకుండా డైలాగులు పలికాడని, నిజ జీవితంలో ఆచరించే అవకాశం వచ్చినా పాటించకుండా పార్టీని వదులుకున్నాడని కాసింత విమర్శనాత్మక ధోరణిలో అన్నాడు. దీనికి పా రంజిత్ స్పందిస్తూ బిగ్గరగా నవ్వడం అభిమానులకు ఆగ్రహం కలిగింది. నిజానికి ఆ స్థానంలో తలైవర్ ని సమర్ధిస్తూ సినిమా, పాలిటిక్స్ రెండు వేర్వేరని చెప్పాల్సిందని వాళ్ళ వెర్షన్.
అలా డిమాండ్ చేయడంలో లాజిక్ ఉంది. ఎందుకంటే తెరమీద చేసేదంతా రియల్ లైఫ్ లో పాటించాలని రూల్ లేదు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడానికి ఆరోగ్యంతో సహా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అది వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప ఎప్పుడో వచ్చిన కాలాలో కంటెంట్ గురించి ఇప్పుడు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సాక్ష్యాత్తు దాని దర్శకుడే ఇలా నవ్వడం నిజంగా తప్పే. ఎందుకంటే తను సూపర్ స్టారయ్యాక ఒక దర్శకుడి కెరీర్ ప్రారంభంలోనే రెండు అవకాశాలు రజనీకాంత్ జీవితంలో ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే పా రంజిత్ నవ్వకుండా ఉండాల్సింది. విక్రమ్ తో చేసిన తంగలాన్ మీద ఈ ప్రభావం ఉండే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on April 13, 2024 4:23 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…