నవ్వు నాలుగు విధాలా చేటని పెద్దలు ఊరికే అనలేదు. సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించకుండా తొందరపడితే ఒక్కోసారి పరిణామాలు దూరం వెళ్లిపోతాయి. అలాంటిదే ఈ సంఘటన. కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ తెలుసుగా. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరసగా రెండు భారీ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఇతని సొంతం. కాకపోతే ఆ రెండూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం విచారకరం. దళిత భావజాలాన్ని, ఆ వర్గం మనుగడని కోరుకునే పా రంజిత్ తన ఆలోచనలను తెరమీద చూపిస్తూ ఉంటాడు. రజని అయినా సరే వాటిని అంగీకరించే స్థాయిలో కథలు రాసుకుంటాడు.
ఇటీవలే పా రంజిత్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. తమిళనాడు రాజకీయ పరిణామాలు ప్రధాన అజెండా. వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడుతూ కాలాలో రజనీకాంత్ రాజకీయాల కుళ్ళు గురించి గొప్పగా చెప్పాడని, వాటి అర్థం తెలియకుండా డైలాగులు పలికాడని, నిజ జీవితంలో ఆచరించే అవకాశం వచ్చినా పాటించకుండా పార్టీని వదులుకున్నాడని కాసింత విమర్శనాత్మక ధోరణిలో అన్నాడు. దీనికి పా రంజిత్ స్పందిస్తూ బిగ్గరగా నవ్వడం అభిమానులకు ఆగ్రహం కలిగింది. నిజానికి ఆ స్థానంలో తలైవర్ ని సమర్ధిస్తూ సినిమా, పాలిటిక్స్ రెండు వేర్వేరని చెప్పాల్సిందని వాళ్ళ వెర్షన్.
అలా డిమాండ్ చేయడంలో లాజిక్ ఉంది. ఎందుకంటే తెరమీద చేసేదంతా రియల్ లైఫ్ లో పాటించాలని రూల్ లేదు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడానికి ఆరోగ్యంతో సహా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అది వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప ఎప్పుడో వచ్చిన కాలాలో కంటెంట్ గురించి ఇప్పుడు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సాక్ష్యాత్తు దాని దర్శకుడే ఇలా నవ్వడం నిజంగా తప్పే. ఎందుకంటే తను సూపర్ స్టారయ్యాక ఒక దర్శకుడి కెరీర్ ప్రారంభంలోనే రెండు అవకాశాలు రజనీకాంత్ జీవితంలో ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే పా రంజిత్ నవ్వకుండా ఉండాల్సింది. విక్రమ్ తో చేసిన తంగలాన్ మీద ఈ ప్రభావం ఉండే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on April 13, 2024 4:23 pm
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…
అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ…