ఒక బ్లాక్ బస్టర్ సాధించాక దాని తర్వాత చేయబోయే సినిమా మీద కొందరు దర్శకులు విపరీతమైన ఒత్తిడి తెచ్చుకుని చేదు ఫలితాలు అందుకోవడం అవకాశాలను ప్రభావితం చేస్తోంది. 2018 గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ అయిదేళ్ళు ఖర్చు పెడితే మహేష్ బాబు సర్కారు వారి పాట ఛాన్స్ దొరికింది. దీనికన్నా ముందు నాగ చైతన్యతో ఒక ప్రాజెక్టుని దాదాపు ఓకే చేసుకునే స్టేజిలో వదులుకోవడం బయటికి కనిపించని కోల్డ్ వార్ కు దారి తీసిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు సర్కారు వారి పాటకు వసూళ్లు వచ్చాయి కానీ కంటెంట్ పరంగా పరశురామ్ బెస్ట్ అనిపించుకోలేదు.
ఇక ది ఫ్యామిలీ స్టార్ సంగతి సరేసరి. మాములు ఫ్లాప్ అయితే ఎదో అనుకోవచ్చు. డిజాస్టర్ దిశగా అడుగులు అడుగులు పడుతున్న వైనం కలెక్షన్లలో కనిపిస్తోంది. హాలిడేస్ కూడా ఉపయోగపడటం లేదు. విజయ్ దేవరకొండకు మరో నిరాశ కలిగించే ఫలితమే దక్కింది. కట్ చేస్తే ఇప్పుడు పరశురామ్ కు ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కథల కూర్పులో, మేకింగ్ లో తన బలహీనతలు రెండుసార్లు దెబ్బ కొట్టాయి. స్క్రిప్ట్ విషయంలో ఎవరి మాటా వినడనే కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లోనే ఉంది. ఇలాంటి టాక్ ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు పట్టడం సులభం కాదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దిల్ రాజునే మరో సినిమా ఇస్తానని హామీ ఇచ్చారట. గతంలో వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ తదితరులను తన బ్యానర్లోనే ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో ఇంకో అవకాశం ఇచ్చి కెరీర్ కుదురుకునేలా చేశారు. పరశురామ్ కు అలాంటి ఆఫరే ఇవ్వొచ్చని తెలిసింది. అయితే హీరోని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు కాస్త పెద్ద లెవెల్ స్టార్ దొరికితే సరైన కథతో హిట్టు కొట్టొచ్చు. కాకపోతే ఎవరు ఎస్ అంటారనేది అంత సులభంగా తేలని భేతాళ ప్రశ్న.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…