ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో ఎలాంటి బ్రేక్ ఇస్తుందో ముందే చెప్పడం కష్టం. ఏళ్ళ తరబడి ఎదురు చూసిన వాళ్లకు ఒక్క బ్లాక్ బస్టర్ జాతకం మార్చేస్తుంది. ఒక్క డిజాస్టర్ నిచ్చెన నుంచి కిందకు పడేస్తుంది. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టిలు ఇవాళ ఈ స్టేజిలో ఉన్నారంటే సైడ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టిన వాళ్ళ ప్రయాణంలో ఎన్నో రాళ్లను తట్టుకోవడం వల్లే సాధ్యమయ్యింది. తేజ సజ్జ కూడా ఈ కోవలోకి వచ్చేయబోతున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే హనుమాన్ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకోవడం మాటలు కాదు. ఇక అసలు పాయింట్ కు వచ్చేద్దాం.
ఇటీవలే ఆహా-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. అది లైవ్ గా టీవీలో వచ్చిన వేడుక కాదు కాబట్టి ఆ విశేషాలు సగటు ప్రేక్షకులకు అందుబాటులోకి రాలేదు. తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ మొదలయ్యాక ఆసక్తి గొలిపే సంఘటనలు చోటు చేసుకోవడం బయట పడింది. వాటిలో చిరంజీవి తీసుకొచ్చిన తేజ సజ్జ ప్రస్తావన ఉంది. తనకు ఎప్పటి నుంచో ఇష్ట దైవమైన హనుమంతుడి మీద సినిమా చేయాలని చాలా సార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని, బాల నటుడిగా తన స్ఫూర్తితో వచ్చిన తేజ దాన్ని చేయడం గర్వంగా ఉందని సంతోషాన్ని పంచుకున్నారు.
హనుమాన్ చూశాక ఆ విజయం తనే సాధించినంత ఆనందంగా ఉందని తేజ సజ్జ చూస్తుండగానే స్టేజి మీద చెప్పడంతో చప్పట్లు మారుమ్రోగాయి. నిజమే మరి. ఇంద్ర, చూడాలని ఉంది లాంటి క్లాసిక్స్ లో చిరుతో నటించిన తేజ ఇప్పుడు ఏకంగా ఆయన డ్రీం ప్రాజెక్టునే చేయడం అనూహ్యమే. అయినా మెగాస్టర్ ఆ ముచ్చటని వదిలేయడం లేదు. వసిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరలో ప్రధాన బ్యాక్ డ్రాప్ హనుమంతుడి మీదే జరుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ విగ్రహం పెట్టడం, దాని ఫోటోలు రావడం చూశాంగా. సో అదన్న మాట అంజనీపుత్రుడి కనెక్షన్.
This post was last modified on April 12, 2024 10:51 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…