సముద్రమంత నమ్మకం పెట్టుకుంటే చెరువంత ఫలితాన్ని ఇచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఫలితం నిర్మాత దిల్ రాజుని ఎంత మాత్రం సంతృప్తి పరచలేదన్నది వాస్తవం. కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపైన్ చేశారని సైబర్ కంప్లైంట్ ఇవ్వడం లాంటి చర్యలు కొందరు అభిమానులు చేశారు కానీ వాటి వల్ల కలెక్షన్లు పెంచలేరన్నది ఓపెన్ సీక్రెట్. వరసగా వస్తున్న సెలవులను టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ వాడుకున్నంతగా ఫ్యామిలీ స్టార్ ఉపయోగించుకోలేదు. మధ్యతరగతి ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడే చాలా మంచి సినిమా తీశామని బలంగా చెప్పుకున్న దిల్ రాజుని ఒక్క విషయంలో మెచ్చుకోక తప్పదు.
ఇది కలెక్షన్లు గొప్పగా చెప్పుకునే హైప్ పెంచుకునే ట్రెండ్. రెండో రోజు నుంచే తమ సినిమాకు ఇన్నేసి కోట్లు వచ్చాయని పోస్టర్లలో పెద్ద పెద్ద నెంబర్లు వేసి పబ్లిసిటీ చేయడం గత కొన్నేళ్లుగా ఎన్నో చూస్తున్నాం. ఇమేజ్ ఉన్న హీరోల అసలు ఫిగర్లకు ఓ పాతిక శాతం దాకా ఫేక్ కలిపేసి తమది బ్లాక్ బస్టరని చాటింపేసుకునే ప్రొడ్యూసర్లకు కొదవ లేదు. ఇలా చేయడం కొంత సానుకూల ఫలితాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. దిల్ రాజు మాత్రం వీటి జోలికి వెళ్ళలేదు. ఏప్రిల్ 5 రిలీజ్ రోజు నుంచి మొదలుపెడితే ఏ దశలోనూ వసూళ్లను హైలైట్ చేస్తూ పోస్టర్ కానీ ప్రమోషన్ కానీ చేయకపోవడం గమనార్హం.
దీని కన్నా దారుణంగా తిరస్కారానికి గురైన సినిమాలు ఎన్నో కనీసం వారం వరకు కలెక్షన్ల హడావిడితో ఎంతో కొంత జనాన్ని మభ్యపెట్టే బాపతులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కానీ దిల్ రాజు మాత్రం పబ్లిక్ రియాక్షన్లు, థియేటర్ నుంచి బయటికొచ్చిన జనాల స్పందనలు మాత్రమే వీడియో రూపంలో ప్రమోట్ చేశారు కానీ ఇన్నేసి కోట్లు అన్నేసి కోట్లని ప్రచారంతో ఊదరగొట్టలేదు. ఇది ఒకరకంగా మంచిదే. సుమారు నలభై అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఫ్యామిలీ స్టార్ ఇంకా సగం దూరం పైనే ప్రయాణం చేయాల్సి ఉంది. రెండో వీకెండ్ మీద బోలెడు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది
This post was last modified on April 12, 2024 6:37 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…