కొన్ని వారాల కిందటే వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఐతే అది ఆయన అడిగి పెట్టించుకున్న భద్రత. అందుకు సంబంధించిన ఖర్చంతా రఘురామనే భరిస్తున్నట్లు వెల్లడైంది. ఐతే తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కూడా కేంద్రం ప్రత్యేక భద్రతను కల్పించింది. కానీ ఇక్కడ భద్రత ఖర్చు భరిస్తున్నది కంగనానా ప్రభుత్వమా అనే విషయంలో సందేహాలున్నాయి.
ఐతే ఇక్కడ రూపాయి కూడా కంగనా పెట్టుకోవట్లేదన్నది అధికార వర్గాల సమాచారం. ముంబయిలో అధికార శివసేన పార్టీతో కంగనా కయ్యం పెట్టుకోవడం, భారతీయ జనతా పార్టీ తెర వెనుక ఉండి ఆమెను ఉసిగొల్పుతుండటం, ఆమెకు మద్దతుగా నిలుస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. శివసేన పార్టీ వాళ్లెంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. వారి నుంచి కంగనాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కంగనాకు ప్రభుత్వమే భద్రత కల్పించింది. ఇందుకోసం కంగనా కూడా విజ్ఞప్తి చేసి ఉండొచ్చు.
ఐతే కంగనాకు ‘వై’ కేటగిరి భద్రత కల్పించేందుకు నెలకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలట. బ్రిజేష్ కాలప్ప అనే న్యాయవాది ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. అంటే ప్రజలు కట్టే పన్నుల డబ్బుతోనే కంగనాకు ఆ స్థాయి భద్రత కల్పిస్తున్నారన్నమాట. కాగా ముంబయిలో కంగనాకు ప్రాణహాని ఉందన్న కారణంతో ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ నగరానికి వస్తుంటే భద్రత ఏర్పాట్లు చేశారు.
ఐతే ముంబయిలో కొన్ని రోజుల పాటు ఉన్న కంగనా తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఇంత ఖర్చు పెట్టి ఆమె స్వస్థలంలోనూ భద్రత కల్పించడం ఎందుకు అని బ్రిజేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. దీనికి కంగనా ఘాటుగా బదులిచ్చింది. ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుసని.. తనకు భద్రత అవసరం లేదనుకుంటే తీసేస్తారని.. ముప్పు ఉందంటే ఇంకా పెంచుతారని ఆమె ఆ న్యాయవాదికి రిప్లై ఇచ్చింది ట్విట్టర్లో.
This post was last modified on September 15, 2020 4:39 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…