టాలీవుడ్ యువ కథనాయకుడు శర్వానంద్ కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో సాగుతోంది. ఒకప్పుడు రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మహానుభావుడు లాంటి సక్సెస్లతో మంచి ఊపుమీదుండేవాడు శర్వా. కానీ తర్వాత అతణ్ని వరుసగా పరాజయాలు పలకరించాయి. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు.. ఇలా వరుసగా అతడి సినిమాలు నిరాశపరిచాయి.
చివరగా శర్వా నుంచి ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. కాకపోతే శర్వాకు కొంచెం ఊరటనిచ్చింది. ఐతే కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా.. శర్వాకు అవకాశాలకైతే లోటు లేదు. ఆల్రెడీ అతను మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు.
శ్రీరామ్ ఆదిత్యతో ‘మనమే’ అనే సినిమాతో పాటు ‘లూజర్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఓ చిత్రం.. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజుతో మరో సినిమా అనౌన్స్ చేశాడు శర్వా. ఈ మూడు వివిధ దశల్లో ఉండగా.. ఇప్పుడు శర్వా ఇంకో సినిమాకు రెడీ అయిపోయాడు.
‘ఘాజి’తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంకల్ప్ రెడ్డితో శర్వా ఓ సినిమా చేయబోతున్నాడట. ఇది పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో తెరకెక్కే మూవీ అట. ‘ఘాజి’ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో నిరాశపరిచాడు సంకల్ప్. ఆపై అతను బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్తో ఓటీటీ మూవీ ‘ఐబీ 71’ చేశాడు. అది ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు అతను తిరిగి శర్వా మూవీతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.
This post was last modified on April 10, 2024 6:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…