Movie News

కీరవాణి కూడా అందులో దిగిపోయాడు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంకేతిక విప్లవం. దీని సాయంతో ఎన్నెన్నో పనులు జరిగిపోతున్నాయి. మానవ వనరుల అవసరమే లేకుండా ఎన్నో అద్భుతాలు చేస్తోంది ఏఐ. సంగీత ప్రపంచంలో కూడా ఇది అనూహ్యమైన పనులు చేస్తోంది. చనిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాటలు పాడించేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు పాటలు పాడిస్తోంది. సంగీత దర్శకులు కూాడా నెమ్మదిగా ఏఐ వినియోగానికి అలవాటు పడుతున్నారు.

టాలీవుడ్లో ఇప్పటికే రెండు పేరున్న చిత్రాల్లో ఏఐ వినియోగం జరిగింది. మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్.. ‘హాయ్ నాన్న’ సినిమా కోసం ఏఐని వినియోగించాడు. అంతకంటే ముందు తరుణ్ భాస్కర్ సినిమా ‘కీడా కోలా’ కోసం బాలు వాయిస్‌ను రీక్రియేట్ చేశారు. దీని మీద వివాదం కూడా నడిచింది.

కట్ చేస్తే ఇప్పుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సైతం ఏఐని వినియోగించి పాట క్రియేట్ చేయడం విశేషం. తన సంగీత దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ మి’ కోసం ఆయన ఈ ప్రయత్నం చేశారట. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో దయ్యం నేపథ్యంలో వచ్చే పాట కోసం ఏఐని ఉపయోగించారట. పూర్తి పాట ఏఐ సాయంతోనే రికార్డ్ చేశారట.

కీరవాణి లాంటి పాతతరం సంగీత దర్శకుడు ఇలా టెక్నాలజీ ఉపయోగించి పాట కంపోజ్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. దిల్ రాజు అన్న శిరీష్ తనయుడైన ఆశిష్ రెడ్డి ‘లవ్ మి’లో హీరో. అతడి తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ నెల 25న ‘లవ్ మి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Satya

Recent Posts

సమంత ‘గోల్డు’ గిట్టుబాటు అవుతోంది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…

36 minutes ago

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

2 hours ago

పబ్లిసిటీ ఇంకాస్త పెరగాలి బాల

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…

4 hours ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

5 hours ago

అమెరికా-ఇరాన్‌… మిగిల్చిందేంటి?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28. ప్ర‌పంచం క‌ళ్లు తెరుస్తున్న స‌మ‌యం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

10 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

14 hours ago