ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంకేతిక విప్లవం. దీని సాయంతో ఎన్నెన్నో పనులు జరిగిపోతున్నాయి. మానవ వనరుల అవసరమే లేకుండా ఎన్నో అద్భుతాలు చేస్తోంది ఏఐ. సంగీత ప్రపంచంలో కూడా ఇది అనూహ్యమైన పనులు చేస్తోంది. చనిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్తో పాటలు పాడించేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు పాటలు పాడిస్తోంది. సంగీత దర్శకులు కూాడా నెమ్మదిగా ఏఐ వినియోగానికి అలవాటు పడుతున్నారు.
టాలీవుడ్లో ఇప్పటికే రెండు పేరున్న చిత్రాల్లో ఏఐ వినియోగం జరిగింది. మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్.. ‘హాయ్ నాన్న’ సినిమా కోసం ఏఐని వినియోగించాడు. అంతకంటే ముందు తరుణ్ భాస్కర్ సినిమా ‘కీడా కోలా’ కోసం బాలు వాయిస్ను రీక్రియేట్ చేశారు. దీని మీద వివాదం కూడా నడిచింది.
కట్ చేస్తే ఇప్పుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సైతం ఏఐని వినియోగించి పాట క్రియేట్ చేయడం విశేషం. తన సంగీత దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ మి’ కోసం ఆయన ఈ ప్రయత్నం చేశారట. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో దయ్యం నేపథ్యంలో వచ్చే పాట కోసం ఏఐని ఉపయోగించారట. పూర్తి పాట ఏఐ సాయంతోనే రికార్డ్ చేశారట.
కీరవాణి లాంటి పాతతరం సంగీత దర్శకుడు ఇలా టెక్నాలజీ ఉపయోగించి పాట కంపోజ్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. దిల్ రాజు అన్న శిరీష్ తనయుడైన ఆశిష్ రెడ్డి ‘లవ్ మి’లో హీరో. అతడి తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ నెల 25న ‘లవ్ మి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 10, 2024 1:39 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…