ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంకేతిక విప్లవం. దీని సాయంతో ఎన్నెన్నో పనులు జరిగిపోతున్నాయి. మానవ వనరుల అవసరమే లేకుండా ఎన్నో అద్భుతాలు చేస్తోంది ఏఐ. సంగీత ప్రపంచంలో కూడా ఇది అనూహ్యమైన పనులు చేస్తోంది. చనిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్తో పాటలు పాడించేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు పాటలు పాడిస్తోంది. సంగీత దర్శకులు కూాడా నెమ్మదిగా ఏఐ వినియోగానికి అలవాటు పడుతున్నారు.
టాలీవుడ్లో ఇప్పటికే రెండు పేరున్న చిత్రాల్లో ఏఐ వినియోగం జరిగింది. మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్.. ‘హాయ్ నాన్న’ సినిమా కోసం ఏఐని వినియోగించాడు. అంతకంటే ముందు తరుణ్ భాస్కర్ సినిమా ‘కీడా కోలా’ కోసం బాలు వాయిస్ను రీక్రియేట్ చేశారు. దీని మీద వివాదం కూడా నడిచింది.
కట్ చేస్తే ఇప్పుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సైతం ఏఐని వినియోగించి పాట క్రియేట్ చేయడం విశేషం. తన సంగీత దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ మి’ కోసం ఆయన ఈ ప్రయత్నం చేశారట. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో దయ్యం నేపథ్యంలో వచ్చే పాట కోసం ఏఐని ఉపయోగించారట. పూర్తి పాట ఏఐ సాయంతోనే రికార్డ్ చేశారట.
కీరవాణి లాంటి పాతతరం సంగీత దర్శకుడు ఇలా టెక్నాలజీ ఉపయోగించి పాట కంపోజ్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. దిల్ రాజు అన్న శిరీష్ తనయుడైన ఆశిష్ రెడ్డి ‘లవ్ మి’లో హీరో. అతడి తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ నెల 25న ‘లవ్ మి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 10, 2024 1:39 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…