గత ఏడాది ‘సామజవరగమన’తో కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. ఇటీవలే అతడి నుంచి వచ్చిన ‘ఓం భీం బుష్’ ఓ మాదిరిగా ఆడింది. ఆల్రెడీ రెండు మూడు చిత్రాలు చేతిలో ఉండగా… కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెట్టాడు విష్ణు. ఉగాది రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ విష్ణుకిది హీరోగా 19వ సినిమా. జానకి రామ్ మారెళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఈ సినిమాను మూడు బేనర్లు కలిసి నిర్మిస్తుండడం విశేషం. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, విజిల్ వర్తీ ఫిలిమ్స్ అనే రెండు కొత్త సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యాయి. దీంతో పాటుగా కోన వెంకట్ సంస్థ ‘కోన వెంకట్ ఫిలిమ్ కార్పొరేషన్ కూడా ఈ చిత్రంలో పార్ట్నరే.
కోన వెంకట్తో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లి కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. కామెడీ సినిమాలు శ్రీ విష్ణుకు బాగా కలిసొస్తున్న నేపథ్యంలో అదే జానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. ‘సామజవరగమన’తో మంచి పేరు సంపాదించిన రచయితలు భాను భోగవరపు, నందు సవిరగన ఈ చిత్రానికి కూడా రచన అందిస్తుండడం విశేషం.
‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చనుండగా.. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు చూసుకుంటాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం పీపుల్స్ మీడియా బేనర్లో ‘స్వాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి రూపొందిస్తున్న చిత్రమిది. ఇది కాక రెండు ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…