గత ఏడాది ‘సామజవరగమన’తో కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. ఇటీవలే అతడి నుంచి వచ్చిన ‘ఓం భీం బుష్’ ఓ మాదిరిగా ఆడింది. ఆల్రెడీ రెండు మూడు చిత్రాలు చేతిలో ఉండగా… కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెట్టాడు విష్ణు. ఉగాది రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ విష్ణుకిది హీరోగా 19వ సినిమా. జానకి రామ్ మారెళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
ఈ సినిమాను మూడు బేనర్లు కలిసి నిర్మిస్తుండడం విశేషం. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, విజిల్ వర్తీ ఫిలిమ్స్ అనే రెండు కొత్త సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యాయి. దీంతో పాటుగా కోన వెంకట్ సంస్థ ‘కోన వెంకట్ ఫిలిమ్ కార్పొరేషన్ కూడా ఈ చిత్రంలో పార్ట్నరే.
కోన వెంకట్తో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లి కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. కామెడీ సినిమాలు శ్రీ విష్ణుకు బాగా కలిసొస్తున్న నేపథ్యంలో అదే జానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. ‘సామజవరగమన’తో మంచి పేరు సంపాదించిన రచయితలు భాను భోగవరపు, నందు సవిరగన ఈ చిత్రానికి కూడా రచన అందిస్తుండడం విశేషం.
‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చనుండగా.. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు చూసుకుంటాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం పీపుల్స్ మీడియా బేనర్లో ‘స్వాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి రూపొందిస్తున్న చిత్రమిది. ఇది కాక రెండు ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి.
This post was last modified on April 9, 2024 5:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…