‘ఫ్యామిలీ స్టార్’తో మరో ఎదురు దెబ్బ తిన్నాడు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ‘లైగర్’ అతడికి దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. దానికి ముందు, తర్వాత కూడా సరైన ఫలితాలు రాలేదు. ‘ఖుషి’ కూడా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ‘ఫ్యామిలీ స్టార్’తో అయినా రాత మారుతుందని అనుకుంటే.. అది కూడా తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఇక ఈ సినిమా సంగతి వదిలేసి తర్వాతి చిత్రం మీద దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు విజయ్.
ఈ చిత్రానికి ముందు కథానాయికగా అనుకున్నది శ్రీలీలను. ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోవడం, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా నటించాల్సి ఉండడంతో శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి.
కారణాలేవైనప్పటికీ శ్రీలీల అయితే ఈ ప్రాజెక్టులో లేదు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా హీరోయిన్ వేట గట్టిగానే సాగుతోంది. ఒక దశలో ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు పేరును కూడా పరిశీలించారట. కానీ చివరికి ‘మిస్టర్ బచ్చన్’తో మాస్ రాజా రవితేజతో జత కడుతున్న ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సేను ఈ చిత్రంలో కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. విజయ్ పక్కన భాగ్యశ్రీ బాగా సూటవుతుందని భావిస్తున్నారు.
‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి పేరు సంపాదించాడో తెలిసిందే. కానీ దాని హిందీ వెర్షన్ ఫ్లాప్ అయింది. తర్వాత రామ్ చరణ్తో ఓ సినిమా అనుకున్నాడు కానీ.. వర్కవుట్ కాలేదు. చివరికి విజయ్తో సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.
This post was last modified on April 9, 2024 5:36 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…