Movie News

ధ‌నుష్-ఐశ్వ‌ర్య‌.. కోర్టుకెక్కారు

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, ర‌జినీకాంత్ త‌న‌యురాలు ఐశ్వ‌ర్య రెండేళ్ల కింద‌టే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించచ‌డం తెలిసిన సంగ‌తి తెలిసిందే. ఐతే వీళ్లిద్ద‌రూ విడివిడిగా ఈ ప్ర‌క‌ట‌న చేశాక.. అధికారికంగా విడిపోయారా లేదా అనే విష‌యంలో క్లారిటీ లేదు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ల‌ను క‌ల‌ప‌డానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు.. దీంతో విడాకుల వ్య‌వ‌హారం హోల్డ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలా అని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ఎక్క‌డా కూడా మ‌ళ్లీ క‌లిసి క‌నిపించ‌లేదు.

ఐతే ఇప్పుడు ఈ జంట అధికారికంగా విడిపోతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌మ‌కు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నై కోర్టులో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య జంట పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఉమ్మ‌డి అంగీకారంతో ఈ జంట విడిపోవ‌డానికి సిద్ధ‌మైంది.

ద‌ర్శ‌కుడు క‌స్తూరి రాజా త‌న‌యుడైన ధ‌నుష్‌.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కిన తుల్లువ‌దో ఎల‌మై చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కెరీర్లో ఎదుగుతున్న ద‌శ‌లో అత‌ను ఐశ్వ‌ర్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ధ‌నుష్ కంటే ఐశ్వ‌ర్య పెద్ద‌ది. త‌న అక్క క్లాస్ మేట్ కావ‌డంతో అలా ప‌రిచ‌యం జ‌రిగి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ధ‌నుష్ అల్లుడు అయ్యాక ధ‌నుష్ రేంజే మారిపోయింది. అద్భుత‌మైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా అవ‌త‌రించాడు.

ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ల‌కు యుక్త వ‌య‌సులో ఉన్న ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు సాగిన వివాహ బంధానికి తెర‌దించాల‌ని 2022లో ఈ జంట నిర్ణ‌యించుకుంది. మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో కానీ.. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ జంట కోర్టులో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

This post was last modified on April 8, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

32 minutes ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

1 hour ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

3 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

4 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

4 hours ago