Movie News

ధ‌నుష్-ఐశ్వ‌ర్య‌.. కోర్టుకెక్కారు

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, ర‌జినీకాంత్ త‌న‌యురాలు ఐశ్వ‌ర్య రెండేళ్ల కింద‌టే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించచ‌డం తెలిసిన సంగ‌తి తెలిసిందే. ఐతే వీళ్లిద్ద‌రూ విడివిడిగా ఈ ప్ర‌క‌ట‌న చేశాక.. అధికారికంగా విడిపోయారా లేదా అనే విష‌యంలో క్లారిటీ లేదు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ల‌ను క‌ల‌ప‌డానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు.. దీంతో విడాకుల వ్య‌వ‌హారం హోల్డ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలా అని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ఎక్క‌డా కూడా మ‌ళ్లీ క‌లిసి క‌నిపించ‌లేదు.

ఐతే ఇప్పుడు ఈ జంట అధికారికంగా విడిపోతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌మ‌కు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నై కోర్టులో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య జంట పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఉమ్మ‌డి అంగీకారంతో ఈ జంట విడిపోవ‌డానికి సిద్ధ‌మైంది.

ద‌ర్శ‌కుడు క‌స్తూరి రాజా త‌న‌యుడైన ధ‌నుష్‌.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కిన తుల్లువ‌దో ఎల‌మై చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కెరీర్లో ఎదుగుతున్న ద‌శ‌లో అత‌ను ఐశ్వ‌ర్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ధ‌నుష్ కంటే ఐశ్వ‌ర్య పెద్ద‌ది. త‌న అక్క క్లాస్ మేట్ కావ‌డంతో అలా ప‌రిచ‌యం జ‌రిగి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ధ‌నుష్ అల్లుడు అయ్యాక ధ‌నుష్ రేంజే మారిపోయింది. అద్భుత‌మైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా అవ‌త‌రించాడు.

ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ల‌కు యుక్త వ‌య‌సులో ఉన్న ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. 18 ఏళ్ల పాటు సాగిన వివాహ బంధానికి తెర‌దించాల‌ని 2022లో ఈ జంట నిర్ణ‌యించుకుంది. మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో కానీ.. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ జంట కోర్టులో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

This post was last modified on April 8, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

56 minutes ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

1 hour ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

1 hour ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

5 hours ago