మంచు విష్ణు హీరోగా తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీస్టారర్ కన్నప్పలో క్యాస్టింగ్ అంతకంతా పెరుగుతూ పోతోంది. నిజానికి ఇంత పెద్ద తారాగణం అవసరమయ్యేంత స్కోప్ అందులో ఏముందో తెలియాలంటే ఒకటి పుస్తకం చదవాలి లేదా కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప సినిమా చూడాలి. ఈ లెక్కన చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి పాత్రకు ఇమేజ్ ఉన్న స్టార్ నటీనటులను తీసుకోవడం ద్వారా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ రీచ్ రావాలి, బడ్జెట్ లెక్కల్లో వర్కౌట్ అవ్వాలంటే ఈ స్ట్రాటజీనే కరెక్ట్.
ముందుగా చెప్పుకునే స్టార్ అట్రాక్షన్ ప్రభాసని వేరే చెప్పనక్కర్లేదు. శివుడిగా కనిపించేది కాసేపే అయినా చాలా పవర్ ఫుల్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ డిజైన్ చేసినట్టు సమాచారం. పార్వతిగా నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు ఏ క్యారెక్టర్లు చేస్తున్నది ఇంకా తెలియలేదు. బ్రహ్మానందం, కౌశల్ మందా లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ చాలానే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేరబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ముందు నుంచి కన్నప్ప గురించి వస్తున్న లీకులన్నీ దాదాపు నిజమైనవే ఎక్కువ.
శివరాత్రికి వదిలిన ప్రీ లుక్ పోస్టర్ తప్ప కన్నప్పకు సంబంధించి ఇంకా ప్రమోషన్లు మొదలుకాలేదు. ఈ ఏడాది విడుదల సాధ్యం కాకపోవచ్చట. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కు ఎక్కువ సమయం అవసరం ఉండటంతో 2025 ప్రథమార్థంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇతిహాస గాథకు టాలీవుడ్ టీమ్ తో పాటు పలువురు అంతర్జాతీయ నిపుణులు పని చేస్తున్నారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు విష్ణుకి నటన, మేకింగ్ రెండింట్లోనూ ఛాలెంజ్ గా నిలుస్తున్న కన్నప్ప మీద మంచు ఫ్యామిలీ గట్టి నమ్మకం పెట్టుకుంది.
This post was last modified on April 8, 2024 9:31 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…