మామూలుగా టాలీవుడ్ బాక్సాఫీస్లో సంక్రాంతికి ఒక వారం పాటు మోత మోగిపోతుంటుంది. ఆ తర్వాత ఎక్కువ సందడి ఉండేది వేసవిలోనే. కానీ గత ఏడాది, అలాగే ఈ సంవత్సరం వేసవిలో పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేదు. ఐతే ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెద్ద సినిమాల హంగామా ఒక రేంజిలో ఉండబోతోంది. ముఖ్యంగా సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు చివరి వరకు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ కాబోతోంది.
సెప్టెంబరు చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ రానున్న సంగతి తెలిసిందే. నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా మరోసారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇక అక్టోబరు రెండో వారంలో బాక్సాఫీస్ షేక్ అయ్యే సినిమాలు రాబోతున్నాయి.
అక్టోబరు 10కి ఆల్రెడీ పాన్ఇండియా మూవీ దేవర షెడ్యూల్ అయి ఉంది. అదే వారం సూర్య సినిమా కంగువను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే మూవీనే. మరోవైపు నాగచైతన్య సినిమా తండేల్కు కూడా అక్టోబరు రెండో వారాన్నే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దేవర, కంగువ రెండూ రెండో వారమే వస్తే తండేల్ను తర్వాతి వారం రిలీజ్ చేస్తారు. రామ్ చరణ్-శంకర్ల క్రేజీ మూవీ గేమ్ చేంజర్ను కూడా అక్టోబరులోనే రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది చివరి వారంలో వస్తుందని సమాచారం.
తాజాగా అక్టోబరు రేసులోకి మరో పెద్ద చిత్రం వచ్చింది. అదే.. రజినీకంత్ మూవీ వేట్టయాన్. ఆ సినిమాను అక్టోబరు చివరి రెండు వారాల్లో ఏదో ఒక డేట్కు రిలీజ్ చేస్తారట. మొత్తానికి సెప్టెంబరు చివర్నుంచి అక్టోబరు చివరి వరకు నెల రోజుల పాటు సందడే సందడన్నమాట.
This post was last modified on April 8, 2024 9:34 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…