లెజెండ్ తర్వాత జగపతిబాబు కెరీర్ ఎంత గొప్ప మలుపు తిరిగిందో తెలిసిందే. ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. చేసే ప్రతి పాత్రకూ మంచి పారితోషకమూ అందింది. కానీ తనకు ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల విసుగొచ్చేసిందని.. సెకండ్ ఇన్నింగ్స్లో మంచి పాత్రలు అని చెప్పుకోదగ్గవి ఐదారుకు మించి లేవని ఆయన తరచుగా బాధ పడుతుంటారు. తన పాత్రలు, వాటి లుక్స్ ఒకేలా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.
రంగస్థలం, అరవింద సమేత లాంటి సినిమాల్లో పాత్రల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్లోనూ అలవాటైన రిచ్ డాడ్ పాత్రలోనే కనిపించిన జగపతిబాబు.. రాబోయే ఓ కొత్త సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి జగపతిబాబు లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. అరవింద సమేత తరహా రగ్డ్ క్యారెక్టర్లా కనిపిస్తోందిది. జగపతిబాబు లుక్.. డ్రెస్సింగ్.. మొత్తంగా ఆయన ఆహార్యం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇది నెగెటివ్ రోలే అయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జగపతిబాబు ఇలాంటి డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషనే కోరుకుంటారు. పాత్ర కొత్తగా ఉంటే పారితోషకం కూడా తగ్గించుకుని నటించడానికి తాను రెడీ అని అంటుంటారు జగపతి. మరి ఆయన ఆకలి తీర్చే పాత్రే హరీష్ శంకర్ ఇచ్చి ఉంటాడేమో చూడాలి. బాలీవుడ్ మూవీ రైడ్కు ఇది తెలుగు అడాప్షన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on April 8, 2024 9:23 am
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…