ది ఫ్యామిలీ స్టార్ కోసం ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదలను ఎంచుకున్న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికన్నా ఎక్కువ జోరు చూపిస్తోంది. విజయ్ దేవరకొండ పోటీని తట్టుకోగలదానే అనుమానాలు పటాపంచలు చేస్తూ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల బుకింగ్స్ ని పరిగణనలోకి తీసుకుంటే 38 వేల టికెట్లు అమ్మడు పోవడమంటే మాటలు కాదు. ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అందులోనూ స్టార్స్ లేని ఒక మాములు మూవీకి ఇంత రెస్పాన్స్ అంటే అనూహ్యమే.
ఆదివారం ఈ దూకుడు కొనసాగడం ఖాయం. చాలా చోట్ల షోలు పెంచేశారు. ముందు ఇవ్వమని మంకుపట్టు పట్టిన కొన్ని మల్టీప్లెక్సులు డిమాండ్ గమనించాక క్రమంగా కౌంట్ పెంచడం మొదలుపెట్టాయి. ఏపీలోని ఒక జిల్లా కేంద్రంలోనని థియేటర్ సముదాయంలో ఫస్ట్ డే కేవలం రెండు షోలు ఇచ్చారు. ప్రీమియర్ కావడం ఆలస్యం ఆ సంఖ్య అయిదు దాటేసింది. దీన్ని బట్టే జనానికి ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . అలా అని ఇదేదో వంద కోట్లు తెచ్చే స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడదు కానీ ఇంత మాత్రం రాబట్టడం మాత్రం చాలా గొప్ప సక్సెస్ కిందే లెక్క.
చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ కి మరోసారి పంట పడినట్టే. ఎల్లుండి ఉగాది పండక్కు ఇదే పికప్ కొనసాగుతుంది. అలా అని తెలుగు ఆడియన్స్ నుంచి యునానిమస్ గా అదిరిపోయే టాక్ రాలేదు కానీ మంచి అనుభూతితో బయటికి వచ్చి దాన్నే టాక్ రూపంలో ఇతరులకు చెబుతున్నారు. అది పాజిటివ్ గా వెళ్ళిపోయి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దానికి తోడు కేరళలో 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో అంతగా ఏముందబ్బా అనే యాంగ్జైటీతోనే వెళ్తున్న ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు రెండు కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందట. ఇదే ఫ్లో ఉంటే ప్రేమలుని సులభంగా దాటేస్తుంది.
This post was last modified on April 7, 2024 12:50 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…