ది ఫ్యామిలీ స్టార్ కోసం ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదలను ఎంచుకున్న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికన్నా ఎక్కువ జోరు చూపిస్తోంది. విజయ్ దేవరకొండ పోటీని తట్టుకోగలదానే అనుమానాలు పటాపంచలు చేస్తూ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల బుకింగ్స్ ని పరిగణనలోకి తీసుకుంటే 38 వేల టికెట్లు అమ్మడు పోవడమంటే మాటలు కాదు. ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అందులోనూ స్టార్స్ లేని ఒక మాములు మూవీకి ఇంత రెస్పాన్స్ అంటే అనూహ్యమే.
ఆదివారం ఈ దూకుడు కొనసాగడం ఖాయం. చాలా చోట్ల షోలు పెంచేశారు. ముందు ఇవ్వమని మంకుపట్టు పట్టిన కొన్ని మల్టీప్లెక్సులు డిమాండ్ గమనించాక క్రమంగా కౌంట్ పెంచడం మొదలుపెట్టాయి. ఏపీలోని ఒక జిల్లా కేంద్రంలోనని థియేటర్ సముదాయంలో ఫస్ట్ డే కేవలం రెండు షోలు ఇచ్చారు. ప్రీమియర్ కావడం ఆలస్యం ఆ సంఖ్య అయిదు దాటేసింది. దీన్ని బట్టే జనానికి ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . అలా అని ఇదేదో వంద కోట్లు తెచ్చే స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడదు కానీ ఇంత మాత్రం రాబట్టడం మాత్రం చాలా గొప్ప సక్సెస్ కిందే లెక్క.
చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ కి మరోసారి పంట పడినట్టే. ఎల్లుండి ఉగాది పండక్కు ఇదే పికప్ కొనసాగుతుంది. అలా అని తెలుగు ఆడియన్స్ నుంచి యునానిమస్ గా అదిరిపోయే టాక్ రాలేదు కానీ మంచి అనుభూతితో బయటికి వచ్చి దాన్నే టాక్ రూపంలో ఇతరులకు చెబుతున్నారు. అది పాజిటివ్ గా వెళ్ళిపోయి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దానికి తోడు కేరళలో 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో అంతగా ఏముందబ్బా అనే యాంగ్జైటీతోనే వెళ్తున్న ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు రెండు కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందట. ఇదే ఫ్లో ఉంటే ప్రేమలుని సులభంగా దాటేస్తుంది.
This post was last modified on April 7, 2024 12:50 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…