ది ఫ్యామిలీ స్టార్ కోసం ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదలను ఎంచుకున్న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికన్నా ఎక్కువ జోరు చూపిస్తోంది. విజయ్ దేవరకొండ పోటీని తట్టుకోగలదానే అనుమానాలు పటాపంచలు చేస్తూ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల బుకింగ్స్ ని పరిగణనలోకి తీసుకుంటే 38 వేల టికెట్లు అమ్మడు పోవడమంటే మాటలు కాదు. ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అందులోనూ స్టార్స్ లేని ఒక మాములు మూవీకి ఇంత రెస్పాన్స్ అంటే అనూహ్యమే.
ఆదివారం ఈ దూకుడు కొనసాగడం ఖాయం. చాలా చోట్ల షోలు పెంచేశారు. ముందు ఇవ్వమని మంకుపట్టు పట్టిన కొన్ని మల్టీప్లెక్సులు డిమాండ్ గమనించాక క్రమంగా కౌంట్ పెంచడం మొదలుపెట్టాయి. ఏపీలోని ఒక జిల్లా కేంద్రంలోనని థియేటర్ సముదాయంలో ఫస్ట్ డే కేవలం రెండు షోలు ఇచ్చారు. ప్రీమియర్ కావడం ఆలస్యం ఆ సంఖ్య అయిదు దాటేసింది. దీన్ని బట్టే జనానికి ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . అలా అని ఇదేదో వంద కోట్లు తెచ్చే స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడదు కానీ ఇంత మాత్రం రాబట్టడం మాత్రం చాలా గొప్ప సక్సెస్ కిందే లెక్క.
చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ కి మరోసారి పంట పడినట్టే. ఎల్లుండి ఉగాది పండక్కు ఇదే పికప్ కొనసాగుతుంది. అలా అని తెలుగు ఆడియన్స్ నుంచి యునానిమస్ గా అదిరిపోయే టాక్ రాలేదు కానీ మంచి అనుభూతితో బయటికి వచ్చి దాన్నే టాక్ రూపంలో ఇతరులకు చెబుతున్నారు. అది పాజిటివ్ గా వెళ్ళిపోయి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దానికి తోడు కేరళలో 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో అంతగా ఏముందబ్బా అనే యాంగ్జైటీతోనే వెళ్తున్న ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు రెండు కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందట. ఇదే ఫ్లో ఉంటే ప్రేమలుని సులభంగా దాటేస్తుంది.
This post was last modified on April 7, 2024 12:50 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…