ది ఫ్యామిలీ స్టార్ ఫలితానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు నిర్మాత దిల్ రాజు నమ్మలేకపోతున్న వైనం మాటల్లో, చేతల్లో కనిపించడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నిన్న ఏకంగా రివ్యూయర్ గా మారిపోయి థియేటర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. గతంలో బ్లాక్ బస్టర్లకు కూడా ఇలా చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టే హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కన్నా ఎక్కువగా ఆయన ఎంతగా ఈ మిడిల్ క్లాస్ స్టోరీని ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు.
స్వంత సినిమా కాబట్టి అంత ఆపేక్ష ఉండటంలో తప్పు లేదు. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవల్ పరిస్థితి వేరుగా ఉండటం కప్పిపుచ్చేది కాదు. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కన్నా టిల్లు స్క్వేర్ టికెట్లే రెండు మూడు వేలు ఎక్కువగా అమ్ముడుపోవడం కళ్ళముందు కనిపిస్తోంది. చాలా చోట్ల మంజుమ్మెల్ బాయ్స్ హౌస్ ఫుల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఆదివారం కీలకం కావడం, మంగళవారం ఉగాది పండగ సెలవు నేపథ్యంలో వీలైనంత వసూళ్లు రావటానికి ఫ్యామిలీ స్టార్ కు ఈ రెండు రోజులు చాలా కీలకం. కానీ దీని కంటే ఎక్కువగా పోటీదారులు వాటిని క్యాష్ చేసుకునేలా ఉండటం ఈ ఆందోళనకు కారణం.
నిర్మాతగా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాని మరింత చేరువ చేయడం కోసం దిల్ రాజు ఇంత చేయడం తప్పు పట్టేది కాదు. ఈ కమిట్ మెంట్ వసూళ్లుగా మారినప్పుడే సార్థకత చేకూరుతుంది. ప్రేక్షకులు కేవలం ఆయన ఒక్కరి మాట విని నిర్ణయాలు తీసుకోరుగా. పబ్లిక్ టాక్ ఎవరూ ఆపేది కాదు, నియంత్రించేది కాదు. కావాలని ఎవరో పుట్టించేది కాదు. కంటెంట్ లో సత్తా ఉంటే ఇదే దిల్ రాజు గారి బలగం నైజాంలో రికార్డులు సృష్టించిన విషయం మర్చిపోకూడదు. ఆడగకపోయినా అప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు.. శాయశక్తులా దిల్ రాజు చేస్తున్న పబ్లిసిటీ మంచి రిజల్ట్ గా మారితే సంతోషమే.
This post was last modified on April 7, 2024 12:45 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…