ది ఫ్యామిలీ స్టార్ ఫలితానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు నిర్మాత దిల్ రాజు నమ్మలేకపోతున్న వైనం మాటల్లో, చేతల్లో కనిపించడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నిన్న ఏకంగా రివ్యూయర్ గా మారిపోయి థియేటర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. గతంలో బ్లాక్ బస్టర్లకు కూడా ఇలా చేసిన దాఖలాలు లేవు. దీన్ని బట్టే హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కన్నా ఎక్కువగా ఆయన ఎంతగా ఈ మిడిల్ క్లాస్ స్టోరీని ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు.
స్వంత సినిమా కాబట్టి అంత ఆపేక్ష ఉండటంలో తప్పు లేదు. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవల్ పరిస్థితి వేరుగా ఉండటం కప్పిపుచ్చేది కాదు. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కన్నా టిల్లు స్క్వేర్ టికెట్లే రెండు మూడు వేలు ఎక్కువగా అమ్ముడుపోవడం కళ్ళముందు కనిపిస్తోంది. చాలా చోట్ల మంజుమ్మెల్ బాయ్స్ హౌస్ ఫుల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఆదివారం కీలకం కావడం, మంగళవారం ఉగాది పండగ సెలవు నేపథ్యంలో వీలైనంత వసూళ్లు రావటానికి ఫ్యామిలీ స్టార్ కు ఈ రెండు రోజులు చాలా కీలకం. కానీ దీని కంటే ఎక్కువగా పోటీదారులు వాటిని క్యాష్ చేసుకునేలా ఉండటం ఈ ఆందోళనకు కారణం.
నిర్మాతగా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాని మరింత చేరువ చేయడం కోసం దిల్ రాజు ఇంత చేయడం తప్పు పట్టేది కాదు. ఈ కమిట్ మెంట్ వసూళ్లుగా మారినప్పుడే సార్థకత చేకూరుతుంది. ప్రేక్షకులు కేవలం ఆయన ఒక్కరి మాట విని నిర్ణయాలు తీసుకోరుగా. పబ్లిక్ టాక్ ఎవరూ ఆపేది కాదు, నియంత్రించేది కాదు. కావాలని ఎవరో పుట్టించేది కాదు. కంటెంట్ లో సత్తా ఉంటే ఇదే దిల్ రాజు గారి బలగం నైజాంలో రికార్డులు సృష్టించిన విషయం మర్చిపోకూడదు. ఆడగకపోయినా అప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు.. శాయశక్తులా దిల్ రాజు చేస్తున్న పబ్లిసిటీ మంచి రిజల్ట్ గా మారితే సంతోషమే.
This post was last modified on April 7, 2024 12:45 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…