గత నెలలో ‘ప్రేమలు’ అనే మలయాళ అనువాద చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిన్నపాటి సంచలనమే రేపింది. ఇది మామూలు లవ్ స్టోరీనే. అందులో హీరో హీరోయిన్లు అస్సలు మనవాళ్లకు పరిచయం లేదు. అయినా ఆ చిత్రం ఆశ్చర్యకర రీతిలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన ఎస్.ఎస్.కార్తికేయ మంచి లాభాలందుకున్నాడు. తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకుంది.
ఇప్పుడు అలాంటి మ్యాజిక్కే ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా రిపీట్ చేస్తుందా అని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రానికి రిలీజ్ టైమింగ్ అంత బాగా కుదిరింది. ఏప్రిల్ అంటే సినిమాలకు అనువైన సమయం. ఎలాంటి సినిమాకైనా ఈ సీజన్లో మంచి వసూళ్లే వస్తుంటాయి.
పైగా ఈ వారం రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రేక్షకులకు సెకండ్ ఛాయిస్ లాగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఉంది. ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెల రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ థ్రిల్లర్ మూవీ కోసం తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తున్నారు.
‘ప్రేమలు’ తరహాలోనే ముందు రోజు ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే మంచి స్పందన వచ్చింది. డిమాండును బట్టి చివర్లో షోలు కూడా పెంచాల్సి వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్గా వస్తుండడంతో మంచి బజ్ మధ్య రిలీజ్ కాబోతోంది ‘మంజుమ్మెల్ బాయ్స్’. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తుండడంతో మంచి థియేటర్లు దొరుకుతున్నాయి. పబ్లిసిటీకీ ఢోకా ఉండదు. కాబట్టి ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on April 6, 2024 10:14 am
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…