ఒకప్పుడు దాదాపు మూడు గంటల నిడివితో చాలా సినిమాలు వచ్చేవి. ఏ మూవీ కూడా రెండున్నర గంటలకు తగ్గేది కాదు. కానీ కాల క్రమంలో నిడివి అనేది పెద్ద సమస్యగా మారి రన్ టైం తగ్గించేయడం మొదలుపెట్టాడు. రెండు, రెండుంబావు గంటల నిడివితో సినిమాలు పెరిగాయి. కానీ ఈ మధ్య మళ్లీ రన్ టైం పెంచుతున్నారు. సినిమాలో దమ్ము ఉంటే నిడివి పెద్ద సమస్య కాదని.. ల్యాగ్ అనే మాట వినిపించదని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. కానీ ఇలా ధీమాగా వచ్చే అన్ని సినిమాలూ క్లిక్ కావట్లేదు. కొన్నిసార్లు సుదీర్ఘ నిడివి సమస్యగా మారి ‘ల్యాగ్’ కంప్లైంట్లు ఎక్కువైపోతున్నాయి.
ఈ శుక్రవారం విడుదల కానున్న ‘ఫ్యామిలీ స్టార్’ 2 గంటల 43 నిమిషాల నిడివితో విడుదల కానున్నట్లు ముందు వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్లో కూడా అదే నిడివి కనిపించింది.
కానీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం రన్ టైం రెండున్నర గంటలే అని పేర్కొన్నారు. సెన్సార్కు పంపిన కాపీలో రన్ టైం 2 గంటల 43 నిమిషాలే అయినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ సినిమాను ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ చివరి సినిమా ‘ఖుషి’కి రన్ టైం కొంత సమస్యగా మారింది. ల్యాగ్ కంప్లైంట్లు వచ్చాయి. అందుకే సినిమాను క్రిస్ప్గా తయారు చేసి థియేటర్లలోకి దించితే మంచిదని.. చివరి నిమిషంలో మళ్లీ కత్తెరకు పని చెప్పినట్లు తెలుస్తోంది.
రెండున్నర గంటలు అనేది టాలీవుడ్లో స్టాండర్డ్ రన్ టైం. ఆ ప్రకారమే ఫైనల్ కట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇది సినిమాకు కలిసొచ్చే విషయమే అని భావిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించగా.. దిల్ రాజు నిర్మించాడు.
This post was last modified on April 6, 2024 10:06 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…