గుంటూరు కారం ఫలితం పూర్తి సంతృప్తినివ్వకపోయినా టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో సితార సంస్థ ఆనందం అంతా ఇంతా కాదు. వరసగా సినిమాలు తీయడంలో మైత్రినే దూకుడుగా ఉందనుకుంటున్నాం కానీ ఒకపక్క భారీ బడ్జెట్ ఇంకోవైపు మీడియం రేంజ్ మూవీస్ తో సితార సైతం భారీ ప్రణాళికలు వేస్తోంది. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ మే విడుదలకు రెడీగా ఉంది. గతంలోలా ఈసారి ఎలాంటి వాయిదాలకు ఛాన్స్ లేదు. కంటెంట్ పట్ల టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సగానికి పైగా పూర్తయ్యింది. హీరోతో పాటు వెంకీ అట్లూరి బ్రాండ్ బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది.
బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్బికె 109’ మీద మాములు అంచనాలు లేవు. బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా హాట్ కేక్ కానుంది. వీలైతే దీపావళి లేదా వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు. కొత్తవాళ్లతో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేసిన ‘మేజిక్’ మీద ప్రమోషన్లు మొదలయ్యాక హైప్ వచ్చేస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం టైటిల్ కు తగ్గట్టు మాయాజాలం చేస్తుందని టాక్. వేసవిలో ‘మ్యాడ్ మ్యాక్స్’ షూట్ ప్రారంభించబోతున్నారు. క్యాస్టింగ్ ని కొనసాగిస్తూనే దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఫన్ డోస్ భారీగా పెంచబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఇచ్చిన కిక్ వల్ల కసిమీదున్నారు.
ఇక ‘టిల్లు క్యూబ్’కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అతి త్వరలో మొదలుకాబోతున్నాయి. రవితేజ హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంబోలో అనుదీప్ దర్శకుడిగా ఒక ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అశోక గల్లా హీరోగా రూపొందే అతని మూడో సినిమా అనౌన్స్ మెంట్ సితార టీమ్ ఇవాళే ఇచ్చారు. సాయి దుర్గ తేజ్ తో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ తాలూకు అయోమయం ఒక్కటే తీరాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరిల విడి 12 రౌడీ హీరో కెరీర్లోనే అత్యంత కాస్ట్లీ మూవీగా ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తుంటే సితార స్పీడ్ మామూలుది అనగలరా.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…