Movie News

తన మరణ వార్తపై దర్శకుడి ఫన్నీ పోస్ట్

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకించే బాలీవుడ్ లిబరల్స్ బ్యాచ్‌లో స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒకరు. మోడీ సర్కారు హిందుత్వ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. గత ఏడాది మోడీ సర్కారు తీసుకొచ్చి పౌరసత్వ సవరణ చట్టంతో పాటు అనేక అంశాలపై ఆయన లౌకిక వాదులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాజపా మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం ఆయనకు వారి నుంచి నిరసన ఎదురవుతుంటుంది. అనురాగ్ గురించి ట్రోల్స్ సర్వ సాధారణం. వారిని ‘భక్త్స్’గా అభివర్ణిస్తూ అనురాగ్ కూడా దీటుగా స్పందిస్తూ ఉంటాడు. తాజాగా అనురాగ్ హఠాత్తుగా మరణించాడు, అతడి ఆత్మకు శాంతి కలగాలి అంటూ ఆయన వ్యతిరేకులు ఒక రూమర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది అనురాగ్ దృష్టికి వచ్చింది.

దీనిపై అనురాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ముందు రోజు తాను యమధర్మరాజును కలిశానని.. ఐతే ఆయనే స్వయంగా తనను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని.. ‘‘నువ్వు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. నువ్వు సినిమాలు చేయకుంటే భక్తులకు నీ సినిమాలను బహిష్కరించే అవకాశం ఎలా దక్కుతుంది’’ అని తనతో అన్నాడని అనురాగ్ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇది చూసి ఆయన మద్దతుదారులు ‘భక్త్స్’కు భలే పంచ్ ఇచ్చారంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి సంచనల వ్యాఖ్యలు, చర్యలు అనురాగ్‌కు కొత్తేమీ కాదు. మోడీ సర్కారుకు పూర్తి మద్దతుదారుగా పేరున్న రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని తీవ్రంగా వ్యతిరేకించే అనురాగ్.. తాజాగా స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో కలిసి.. ముంబయిలోని రిపబ్లిక్ టీవీ ఆఫీసుకు వెళ్లాడు. కాలి చెప్పు చిత్రానికి ఫొటో ఫ్రేమ్ కట్టించి దాన్ని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ రూపంలో అర్నాబ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

This post was last modified on September 15, 2020 2:36 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

40 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago