రేపు విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మీద విజయ్ దేవరకొండ అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతికి హనుమాన్ చేసిన రచ్చ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దూకుడు చూపించింది టిల్లు స్క్వేర్ ఒక్కటే. మధ్యలో ఊరి పేరు భైరవకోన, ఓం భీం బుష్ లాంటివి కమర్షియల్ గా వర్కౌట్ చేసుకున్నాయి కానీ వారాల తరబడి జనాలతో థియేటర్లు కళకళలాడేలా చేయలేకపోయాయి. దానికి తోడు ఎన్నికల వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఐపీఎల్ క్రికెట్ సందడి వగైరాలు మూలిగే నక్క మీద తాటిపండులా కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ మీద ఆశలు పెట్టుకోవడం సహజం. ట్రేడ్ టాక్ ప్రకారం సుమారు 45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో రౌడీ హీరో బరిలో దిగుతున్నాడు. ఇది ఖుషి కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బయ్యర్లు కూడా హిట్ టాక్ వస్తే సులభంగానే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. టిల్లు స్క్వేర్ జోరు ఇంకా తగ్గనప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు అదింకా ఆప్షన్ గా మారలేదు. పిల్లలకు వేసవి సెలవులు మొదలు కానుండటంతో ఫ్యామిలీ స్టార్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ టాక్ చాలా కీలకం కానుంది. చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోయినా అండర్ కవర్ ఏజెంట్ లా వస్తున్న మంజుమ్మల్ బాయ్స్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రేమలు లాగా సర్ప్రైజ్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. కాకపోతే మలయాళం డబ్బింగుల ఫలితాలు ముందే ఖచ్చితంగా ఊహించలేని పరిస్థితి నెలకొంది. గీత గోవిందం కాంబినేషన్, మృణాల్ ఠాకూర్ లక్కీ హ్యాండ్, గోపి సుందర్ సంగీతం ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ కు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అగ్రెసివ్ హీరోయిజం లేకుండా సగటు మధ్యతరగతి కుర్రాడిగా విజయ్ దేవరకొండ మేకోవర్ ఆకర్షణగా నిలుస్తోంది.
This post was last modified on April 4, 2024 3:18 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…