రేపు విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మీద విజయ్ దేవరకొండ అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతికి హనుమాన్ చేసిన రచ్చ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దూకుడు చూపించింది టిల్లు స్క్వేర్ ఒక్కటే. మధ్యలో ఊరి పేరు భైరవకోన, ఓం భీం బుష్ లాంటివి కమర్షియల్ గా వర్కౌట్ చేసుకున్నాయి కానీ వారాల తరబడి జనాలతో థియేటర్లు కళకళలాడేలా చేయలేకపోయాయి. దానికి తోడు ఎన్నికల వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఐపీఎల్ క్రికెట్ సందడి వగైరాలు మూలిగే నక్క మీద తాటిపండులా కలెక్షన్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ మీద ఆశలు పెట్టుకోవడం సహజం. ట్రేడ్ టాక్ ప్రకారం సుమారు 45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో రౌడీ హీరో బరిలో దిగుతున్నాడు. ఇది ఖుషి కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బయ్యర్లు కూడా హిట్ టాక్ వస్తే సులభంగానే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. టిల్లు స్క్వేర్ జోరు ఇంకా తగ్గనప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు అదింకా ఆప్షన్ గా మారలేదు. పిల్లలకు వేసవి సెలవులు మొదలు కానుండటంతో ఫ్యామిలీ స్టార్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ టాక్ చాలా కీలకం కానుంది. చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోయినా అండర్ కవర్ ఏజెంట్ లా వస్తున్న మంజుమ్మల్ బాయ్స్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రేమలు లాగా సర్ప్రైజ్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. కాకపోతే మలయాళం డబ్బింగుల ఫలితాలు ముందే ఖచ్చితంగా ఊహించలేని పరిస్థితి నెలకొంది. గీత గోవిందం కాంబినేషన్, మృణాల్ ఠాకూర్ లక్కీ హ్యాండ్, గోపి సుందర్ సంగీతం ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ కు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అగ్రెసివ్ హీరోయిజం లేకుండా సగటు మధ్యతరగతి కుర్రాడిగా విజయ్ దేవరకొండ మేకోవర్ ఆకర్షణగా నిలుస్తోంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…