Movie News

ఎప్పటి సినిమా.. ఇప్పుడు రిలీజేంటి?

మాయవన్ అని తమిళ సినిమా. మన సందీప్ కిషన్ అందులో హీరో. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. నిర్మాతగా *పిజ్జా’; ‘సూదు కవ్వుం’ లాంటి అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేసి తన అభిరుచిని చాటుకున్న సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

కొత్త కాన్సెప్ట్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. ఐతే ఎప్పుడో 2017లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రాజెక్ట్-జడ్ పేరుతో ఈ శుక్రవారమే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత తెలుగులోకి వస్తుండటం విడ్డూరంగా అనిపిస్తోంది.

నిజానికి ‘మాయవన్’ తమిళంలో రిలీజ్ అయిన టైంలోనే ‘ప్రాజెక్ట్-జడ్’ పేరుతో తెలుగులోని అనువాదం చేశారు. రిలీజ్‌కు సన్నాహాలు చేశారు. కానీ ఏవో కారణాలతో అది అప్పుడు విడుదల కాలేదు. తర్వాత తెలుగు వెర్షన్ ఆన్ లైన్లో రిలీజైంది. చాలామంది తెలుగులోనే ఈ సినిమా చూశారు కూడా. కానీ ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఏం సాధిస్తారన్నది అర్థం కాని విషయం.

ఐతే తమిళంలో ‘మాయవన్’కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. సీవీ కుమారే దర్శకుడు, సందీప్ కిషనే హీరో. దీన్ని తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ పార్ట్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నట్లున్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత పెద్దగా పబ్లిసిటీ లేకుండా థియేటర్లలో రిలీజయ్యే సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ఇది వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on April 4, 2024 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

1 hour ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

3 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

4 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

6 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

6 hours ago