Movie News

తేజ సజ్జపై 40 కోట్లు?

బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన చాలామంది కుర్రాళ్లు.. తర్వాత హీరోలై అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. కానీ తరుణ్ తప్ప సుదీర్ఘ కెరీర్ కలిగిన వాళ్లు తక్కువమందే. తరుణ్ సైతం ఒక దశ దాటాక సరైన సినిమాలు పడక ఫేడవుట్ అయిపోయాడు.

ఆ తర్వాత మళ్లీ హీరోగా బలమైన ముద్ర వేసిన బాల నటుడు తేజ సజ్జనే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు.. ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ.. ముందుగా ‘ఓ బేబీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత ‘జాంబి రెడ్డి’తో హీరోగా మారి ఓ మోస్తరు విజయాన్నందుకున్నాడు. ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం ‘హనుమాన్’ మూవీనే. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్‌నే మార్చేసింది.

తేజ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతను ‘హనుమాన్’ రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పేరు.. మిరాయ్. ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రమిది. ‘మిరాయ్’ అనేది జపనీస్ వర్డ్. ఇదొక యాక్షన్ మూవీ అంటున్నారు. ఇందులో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఈగల్’ను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ముందు ఓ మోస్తరు బడ్జెట్లో తీయాలనుకున్న మూవీ ఇది.

కానీ ‘హనుమాన్’తో తేజ మార్కెట్ పెరిగిపోవడం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ ఉండడంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని ప్రణాళికలు మార్చారట. దీంతో బడ్జెట్ రూ.40 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇందులో తేజ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితిక నాయక్ నటిస్తోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. వేసవి చివర్లో సినిమా రిలీజవుతుందట.

This post was last modified on April 3, 2024 10:19 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago