‘సీతారామం’ సినిమాతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది మరాఠీ అమ్మాయి, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఇంతగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన కథానాయికలు అరుదుగా కనిపిస్తారు. ఆ చిత్రంలో అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంది మృణాల్. ఇలాంటి కాంబినేషన్లో హీరోయిన్ల కోసం దర్శకులు కూడా ఎదురు చూస్తుంటారు.
తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చినా.. మృణాల్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రెండో సినిమాగా ‘హాయ్ నాన్న’ లాంటి మరో మంచి మూవీని ఎంచుకుంది. ఆ సినిమా కూడా హిట్టయింది. మరోసారి మృణాల్ అందం, అభినయం అందులో హైలైట్ అయ్యాయి. వరుసగా రెండో చిత్రం కూడా పెద్ద హిట్ కావడంతో మృణాల్కు లక్కీ ఛార్మ్గా పేరొచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి రానున్న కొత్త చిత్రం.. ఫ్యామిలీ స్టార్.
‘గీత గోవిందం’ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్లో రానున్న సినిమా అంటే ఆటోమేటిగ్గా మంచి అంచనాలుంటాయి. ఇక మృణాల్ కూడా తోడవడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే భరోసా ప్రేక్షకుల్లో ఏర్పడింది. మృణాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే పాత్ర లాగే కనిపిస్తోంది తన క్యారెక్టర్. ఇందులోనూ ఆమె అందంగా కనిపిస్తోంది. అలాగే పాత్రలో పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది.
విజయ్, పరశురామ్లకు ‘గీత గోవిందం’ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో మృణాల్ లక్ ఫ్యాక్టర్ పని చేసి ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నారు. విజయ్తో పని చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న దిల్ రాజు ఈ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి మంచి టైమింగ్ కూడా కుదిరింది. అన్నీ కలిసొచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్టవుతుందేమో చూడాలి.
This post was last modified on April 3, 2024 10:18 pm
వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…
ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…
సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…
బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…