ఈ మధ్య తెలుగులో మలయాళ అనువాదాల హడావుడి పెరిగింది. గత నెలలో భ్రమయుగం, ప్రేమలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో భ్రమయుగం ఓ మోస్తరుగా ఆడగా.. ప్రేమలు అందరి అంచనాలనూ మించిపోయి సూపర్ హిట్గా నిలిచింది. మార్చి రెండో వారంలో దీంతో పాటుగా గామి, భీమా లాంటి క్రేజీ తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి.
ఐతే వాటికి దీటుగా ప్రేమలు తెలుగు వెర్షన్ వసూళ్లు రాబట్టింది. భీమా మూవీకి ప్రేమలు చాలా డ్యామేజ్ చేసిన మాట కూడా వాస్తవం. గామి వసూళ్ల మీద కూడా దీని ప్రభావం కొంత పడింది. దీంతో మలయాళ సినిమాలను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే మలయాళం నుంచి రానున్న కొత్త చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు దృష్టిసారించాయి.
ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీకి పోటీగా మంజుమ్మెల్ బాయ్స్ ఈ నెల 5న విడుదల కాబోతోంది. మంజుమ్మెల్ బాయ్స్ మలయాళంలో మామూలు సంచలనం రేపలేదు. రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తమిళనాట అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగానూ నిలిచింది. మన ప్రేక్షకులు అసలే కంటెంట్ బాగుంటే చాలు. ఏ భాషా చిత్రాన్నయినా ఆదరిస్తారు.
ఈ నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్.. ఫ్యామిలీ స్టార్కు ఎలాంటి డ్యామేజ్ చేస్తుందన్నది ఆసక్తికరం. కాకపోతే ఇది సీరియస్ మూవీ. జనాలు ఇప్పుడు ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఇరగాడేస్తోంది. ఫ్యామిలీ స్టార్ కూడా మంచి ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. కాబట్టి వాటిని దాటి మంజుమ్మెల్ బాయ్స్ వైపు తెలుగు ప్రేక్షకులు చూస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే.
ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…