ఈ మధ్య తెలుగులో మలయాళ అనువాదాల హడావుడి పెరిగింది. గత నెలలో భ్రమయుగం, ప్రేమలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో భ్రమయుగం ఓ మోస్తరుగా ఆడగా.. ప్రేమలు అందరి అంచనాలనూ మించిపోయి సూపర్ హిట్గా నిలిచింది. మార్చి రెండో వారంలో దీంతో పాటుగా గామి, భీమా లాంటి క్రేజీ తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి.
ఐతే వాటికి దీటుగా ప్రేమలు తెలుగు వెర్షన్ వసూళ్లు రాబట్టింది. భీమా మూవీకి ప్రేమలు చాలా డ్యామేజ్ చేసిన మాట కూడా వాస్తవం. గామి వసూళ్ల మీద కూడా దీని ప్రభావం కొంత పడింది. దీంతో మలయాళ సినిమాలను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే మలయాళం నుంచి రానున్న కొత్త చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు దృష్టిసారించాయి.
ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీకి పోటీగా మంజుమ్మెల్ బాయ్స్ ఈ నెల 5న విడుదల కాబోతోంది. మంజుమ్మెల్ బాయ్స్ మలయాళంలో మామూలు సంచలనం రేపలేదు. రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తమిళనాట అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగానూ నిలిచింది. మన ప్రేక్షకులు అసలే కంటెంట్ బాగుంటే చాలు. ఏ భాషా చిత్రాన్నయినా ఆదరిస్తారు.
ఈ నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్.. ఫ్యామిలీ స్టార్కు ఎలాంటి డ్యామేజ్ చేస్తుందన్నది ఆసక్తికరం. కాకపోతే ఇది సీరియస్ మూవీ. జనాలు ఇప్పుడు ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఇరగాడేస్తోంది. ఫ్యామిలీ స్టార్ కూడా మంచి ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. కాబట్టి వాటిని దాటి మంజుమ్మెల్ బాయ్స్ వైపు తెలుగు ప్రేక్షకులు చూస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే.
This post was last modified on April 3, 2024 4:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…