వరుస ఫ్లాపులు రావడంతో పాటు తన సినిమాలకు కనీసం వసూళ్లు కూడా రావడం లేదని గ్రహించిన పిమ్మట నారా రోహిత్ రెండేళ్ల పాటు అసలు సినిమాలే చేయలేదు. ఈ సమయంలో బరువు తగ్గించి స్లిమ్ అయిన రోహిత్ ఇప్పుడు కొత్త లుక్తో దర్శనమిస్తున్నాడు. ఫుల్లుగా గడ్డం పెంచి తన న్యూ లుక్ని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్గా పెట్టాడు. దీంతో రోహిత్ మళ్లీ నటించడానికి రెడీ అయిపోయాడని అతనంటే ఇష్టపడే వాళ్లు ఆనందంగా స్పందిస్తున్నారు.
రోహిత్ లుక్ కంటే ముందుగా అల్లు అర్జున్ – సుకుమార్ల ‘పుష్ప’ సినిమాలో విలన్గా నటించబోతున్నాడనే న్యూస్ హల్చల్ చేసింది. కానీ దాని గురించి రోహిత్ ఇంతవరకు స్పందించలేదు. కానీ రోహిత్ కొత్త లుక్ చూసిన తర్వాత ‘పుష్ప’లో క్యారెక్టర్ ఇతను చేస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారు. ఇంకా హీరోగానే కొనసాగాలనే ఆలోచనతోనే రోహిత్ ఇంత బ్రేక్ తీసుకున్నాడు.
తీరా ఇంత గ్యాప్ తర్వాత విలన్ వేషమేస్తే ఇక తనను అలాంటి పాత్రలకు ఫిక్స్ చేసేస్తారేమో అనే ఆందోళన వుండొచ్చు. గోపిచంద్ హీరోగా నటించిన తర్వాత విలన్ వేషాలేసి పెద్ద మాస్ హీరోగా మారిపోయిన సంగతి రోహిత్ మరచిపోకూడదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…