మాములుగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అంటేనే పెద్ద రిస్క్. అంచనాలు మోయలేక ఫెయిలయ్యేవి అధికంగా ఉంటే మొదటి భాగాలను మించి బ్లాక్ బస్టర్స్ అయ్యేవి లేకపోలేదు. టిల్లు స్క్వేర్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 లాంటివి రెండో క్యాటగిరీలోకి వస్తే ఫస్ట్ దాంట్లో మన్మథుడు 2, కిక్ 2, గాయం 2 ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు తయారవుతుంది. అందుకే కొనసాగింపు అంటే హీరోలు దర్శకులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. పుష్ప, కార్తీకేయ అంత పెద్ద సక్సెస్ అందుకున్నాయి కాబట్టే కంటిన్యుయేషన్ సులభమయ్యింది. ఒక హీరో ఒక సీక్వెల్ చేయడం ఇప్పటిదాకా చూస్తున్నాం.
అలాంటిది ఒకేసారి 8 సీక్వెల్స్ కి రంగం సిద్ధం చేసుకుంటున్న స్టార్ ఉన్నారంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. ఆయనే అజయ్ దేవగన్, ఇటీవలే ‘రైడ్ 2’ మొదలైపోయింది. రవితేజ మిస్టర్ బచ్చన్ అఫీషియల్ గా రీమేక్ చేసుకుంటున్నది దీని మొదటి భాగాన్నే. రకుల్, టబుతో ‘దే దే ప్యార్ దే 2’ పనులు ఇటీవలే షురూ చేశారు. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ అఫ్ సర్దార్’ని వర్తమానంలో కొనసాగించబోతున్నారు. ఆగస్ట్ విడుదలకు ‘సింగం అగైన్’ రెడీ అవుతోంది. ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ పనులు జీతూ జోసెఫ్ కొలిక్కి తెస్తున్నారు. ఢమాల్ 4, గోల్ మాల్ 5 ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తాయి.
ఇవి కాకుండా ‘షైతాన్ 2’ని అజయ్ దేవగన్, జ్యోతికలతో పాటు మాధవన్ ని కొత్త షేడ్ లో చూపించే దిశగా ప్రతిపాదన సిద్ధమయ్యిందట. ఈ లెక్కన ఏ భాషలో చూసినా ఇన్ని సీక్వెల్స్ కి సానుకూలంగా ఉన్న ఏకైన హీరో అజయనే చెప్పాలి. వేగంగా తీయడంలో నటించడంలో పేరున్న అజయ్ దేవగన్ దర్శకుడిగానూ యుమీ ఔర్ హం, శివాయ్, భోలా, రన్ వే 34తో ఈ విభాగంలోనూ తనదైన ముద్ర వేశాడు. అయిదేళ్లకు పైగా నిర్మాణంలో మైదాన్ ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రంజాన్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ప్రియమణి జోడిగా నటించింది.
This post was last modified on April 3, 2024 1:39 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…