విజయ్ దేవరకొండకు మొదట్నుంచి యూత్లోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్లో తనకు ఆదరణ కొంచెం తక్కువే. ‘పెళ్లిచూపులు’, ‘గీత గోవిందం’ లాంటి చిత్రాలకు కుటుంబ ప్రేక్షకుల మద్దతు కూడా లభించింది కానీ.. మిగతా సినిమాలన్నింటినీ యూతే భుజాల మీద మోశారు. తన సినిమాల్లో ఘాటు సన్నివేశాలుంటాయనే భయం.. దీనికి తోడు బయట విజయ్ అగ్రెసివ్ బిహేవియర్ ఫ్యామిలీ ఆడియన్స్ను కొంత దూరం చేయడానికి కారణమయ్యాయి.
తనకు ‘బోల్డ్’ ఇమేజ్ను కొంచెం తగ్గించుకుంటే తప్ప తన పరిధి విస్తరించదని విజయ్కు తెలియంది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు లేకుండా పెద్ద రేంజికి వెళ్లడం అంటే చాలా కష్టం. అందుకే విజయ్ ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ లాంటి ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీ చేశాడు. కానీ అది అంత మంచి ఫలితాన్నివ్వలేదు.
ఇప్పుడు విజయ్ నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతోంది. పేరులోనే ‘ఫ్యామిలీ’ ఉండడం.. ఈ సినిమా ప్రోమోలన్నింటిలోనూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హైలైట్ కావడం గమనించవచ్చు. దిల్ రాజు సినిమాలంటేనే ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తాయి. కాకపోతే విజయ్కి ఇంతకుముందున్న ఇమేజ్, గత సినిమాల ఫలితాల దృష్ట్యా ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల మద్దతు ఎంతమేర ఉంటుందనే సందేహాలున్నాయి. చిత్ర బృందం మాత్రం పదే పదే ఇది యూత్తో పాటు ఫ్యామిలీస్కు నచ్చే సినిమా అని నొక్కి వక్కాణిస్తోంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్’ హవా నడుస్తోంది. దాన్నుంచి ప్రేక్షకుల దృష్టి మళ్లించి ‘ఫ్యామిలీ స్టార్’ వైపు తిప్పడం కీలకం. అందుకు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఈ సినిమా బాగా మెప్పించాలి. మరి విజయ్-పరశురామ్ జోడీ ఈ విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతుందో?
This post was last modified on April 2, 2024 6:23 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…