తన పేరిట బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాల కిందట్నుంచి లక్షలాది మందికి అత్యవసర సమయంలో రక్తం అందేలా చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులే కాదు.. సామాన్యులు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవల్ని గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటారు.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ బ్లడ్ బ్యాంక్ తన పని తాను చేసుకుపోతుంటుంది. ఐతే కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక జనం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎంతోమంది సమయానికి రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, తలసేమియా పేషెంట్లకు రక్త కొరత వేధిస్తోంది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మెగాస్టార్.. కష్ట కాలంలో స్వయంగా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
సీనియర్ హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, యువ కథానాయకుడు విశ్వక్సేన్ తదితరులు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే టాలీవుడ్ ఫిలిం జర్నలిస్టులు కూడా రక్తదానానికి ముందుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తం ఇచ్చారు. వీరిని చిరు ఓ ఆడియో సందేశంతో అభినందించారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు ఎల్.లక్ష్మీనారాయణ, వైస్ ఎల్.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు మీరందరూ ఎంతో పెద్ద మనసుతో మా బ్లడ్ బ్యాంక్కు వచ్చి రక్తదానం చేయడం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
మీలాంటి జర్నలిస్టులు ఈ రకంగా ముందుకు రావడం మాకు ఎనలేని ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తాయి. థ్యాంక్ యు సో మచ్. మీ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలి అని చిరంజీవి పేర్కొన్నారు.
This post was last modified on April 27, 2020 1:32 am
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…