తన పేరిట బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాల కిందట్నుంచి లక్షలాది మందికి అత్యవసర సమయంలో రక్తం అందేలా చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులే కాదు.. సామాన్యులు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవల్ని గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటారు.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ బ్లడ్ బ్యాంక్ తన పని తాను చేసుకుపోతుంటుంది. ఐతే కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక జనం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎంతోమంది సమయానికి రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, తలసేమియా పేషెంట్లకు రక్త కొరత వేధిస్తోంది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మెగాస్టార్.. కష్ట కాలంలో స్వయంగా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
సీనియర్ హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, యువ కథానాయకుడు విశ్వక్సేన్ తదితరులు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే టాలీవుడ్ ఫిలిం జర్నలిస్టులు కూడా రక్తదానానికి ముందుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తం ఇచ్చారు. వీరిని చిరు ఓ ఆడియో సందేశంతో అభినందించారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు ఎల్.లక్ష్మీనారాయణ, వైస్ ఎల్.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు మీరందరూ ఎంతో పెద్ద మనసుతో మా బ్లడ్ బ్యాంక్కు వచ్చి రక్తదానం చేయడం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
మీలాంటి జర్నలిస్టులు ఈ రకంగా ముందుకు రావడం మాకు ఎనలేని ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తాయి. థ్యాంక్ యు సో మచ్. మీ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలి అని చిరంజీవి పేర్కొన్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…