తన పేరిట బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాల కిందట్నుంచి లక్షలాది మందికి అత్యవసర సమయంలో రక్తం అందేలా చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులే కాదు.. సామాన్యులు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవల్ని గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటారు.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ బ్లడ్ బ్యాంక్ తన పని తాను చేసుకుపోతుంటుంది. ఐతే కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక జనం బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎంతోమంది సమయానికి రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, తలసేమియా పేషెంట్లకు రక్త కొరత వేధిస్తోంది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మెగాస్టార్.. కష్ట కాలంలో స్వయంగా బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
సీనియర్ హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, యువ కథానాయకుడు విశ్వక్సేన్ తదితరులు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే టాలీవుడ్ ఫిలిం జర్నలిస్టులు కూడా రక్తదానానికి ముందుకొచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తం ఇచ్చారు. వీరిని చిరు ఓ ఆడియో సందేశంతో అభినందించారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు ఎల్.లక్ష్మీనారాయణ, వైస్ ఎల్.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు మీరందరూ ఎంతో పెద్ద మనసుతో మా బ్లడ్ బ్యాంక్కు వచ్చి రక్తదానం చేయడం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
మీలాంటి జర్నలిస్టులు ఈ రకంగా ముందుకు రావడం మాకు ఎనలేని ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తాయి. థ్యాంక్ యు సో మచ్. మీ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలి అని చిరంజీవి పేర్కొన్నారు.
This post was last modified on April 27, 2020 1:32 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…