టిల్లు స్క్వేర్ తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ వాస్తవానికి ఈ వారం నుంచి జాక్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ క్రైమ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే టిల్లు జోరు భారీగా ఉండటంతో ప్రమోషన్లను స్టడీగా ఇంకొక్క పది రోజులు కొనసాగిస్తే వంద కోట్ల గ్రాస్ దాటేందుకు అవకాశాలు పెరుగుతాయి కనక ఆ మేరకు సిద్దు డేట్లు దానికే కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని వల్ల జాక్ కు సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని అంతర్గత సమాచారం.
మరోవైపు ఇందులో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఫ్యామిలీ స్టార్ రిలీజయ్యాక లవ్ మీ ఇఫ్ యు డేర్ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అసలే దిల్ రాజు దీని మీద టన్నుల కొద్ది కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. తన బ్యానర్ కాబట్టి ముందు విజయ్ దేవరకొండ సినిమా సందడి తగ్గాక లవ్ మీ పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ తో ఉన్నారట. దానికి అనుగుణంగా ముందుగానే వైష్ణవి డేట్లను బ్లాక్ చేసుకోమని టీమ్ కు పురమాయించినట్టు తెలిసింది. అడిగితే కాదనలేని పరిస్థితి ఆ అమ్మాయిది. దీంతో సరేననడంతో జాక్ కు రెండో ఇబ్బంది మొదలయ్యిందని వినికిడి.
సో ప్లాన్ చేసుకున్న ప్రకారం కాకుండా తప్పని సిచువేషన్ లో జాక్ ని బ్రేక్ వేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇదంతా ఆఫ్ ది రికార్డు జరుగుతున్న మ్యాటరే కాబట్టి అధికారికంగా ఎవరూ ధృవీకరణ చేయరు. ఒకవేళ టిల్లు స్క్వేర్ కనక ఇంత పెద్ద ఫలితం అందుకోకపోయి ఉంటే సిద్దు త్వరగా జాక్ సెట్లో అడుగు పెట్టేవాడేమో. ఆశిష్ హీరో కావడంతో లవ్ మీని దిల్ రాజు ఎంతగా ఎలివేట్ చేస్తున్నారో చూస్తున్నాం. సో కీలక పాత్ర పోషిస్తున్న వైష్ణవి అది రిలీజయ్యే ఏప్రిల్ మూడో వారం దాకా టీమ్ తో ఉండక తప్పదు. టిల్లు హీరో, బేబీ హీరోయిన్ కాంబో కాబట్టి ఈ మాత్రం డిమాండ్ ఉండటం సబబే మరి.
This post was last modified on April 2, 2024 3:19 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…