Movie News

అల్లు అర్జున్ కోసం అట్లీ స్కెచ్చులు

ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయడంలో తలమునకలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నది అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు అట్లీకే ఓటేశాడన్నది రెండు వారాల క్రితమే లీకైన ఓపెన్ సీక్రెట్. ఇటీవలే ఒక మీటింగ్లో ఇద్దరూ స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేసుకున్నారని, అయితే ఫైనల్ వెర్షన్ పట్ల బన్నీ అంతగా సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టీమ్ తో కలిసి అట్లీ వర్క్ చేస్తున్నాడని చెన్నై అప్డేట్. విజయ్ షారుఖ్ ఖాన్ లతో ప్లాన్ చేసుకున్న మల్టీస్టారర్ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోవడంతో అట్లీ దీని మీద పట్టుదలగా ఉన్నాడు.

క్యాస్టింగ్ గురించి కూడా స్కెచ్చులు వేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్లలో ఒకరిగా సమంతాని తీసుకోవాలని అట్లీ ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ కాంబోతో గతంలో తేరి వచ్చింది. అందులో చనిపోయే పాత్ర అయినా సరే సామ్ కి పెర్ఫార్మన్స్ పరంగా మంచి స్కోప్ దక్కింది. అయితే బన్నీ ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. గతంలో అల్లు అర్జున్, సమంతాలు సన్ అఫ్ సత్యమూర్తిలో జోడిగా కనిపించి మెప్పించారు. పుష్ప 1 ది రైజ్ లో ఊ అంటావా పాటతో ఆడియన్స్ ని సామ్ ఊపేసిన సంగతి తెలిసిందే. సో ఈ కాంబో అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది.

ఇవన్నీ ఫైనల్ కావడానికి ఇంకో రెండు నెలలు పట్టొచ్చు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయాలనేది అట్లీ ఆలోచన. దానికి బన్నీ సానుకూలంగానే ఉన్నాడట. ఇప్పటికే పుష్ప కోసం నాలుగేళ్ల కాలం ఖర్చయిపోయింది కాబట్టి ఇకపై స్పీడ్ పెంచాలనేది అల్లు అర్జున్ సంకల్పం. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో రెండేళ్లకు పైగా పడుతుంది కాబట్టి ఈలోగా అట్లీది పూర్తి చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఏమైనా ఇవన్నీ అంత తేలిగ్గా తేలే వ్యవహారాలా. టైం పడుతుంది.

This post was last modified on April 2, 2024 11:40 am

Share
Show comments
Published by
satya

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

53 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

1 hour ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago