టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడైన విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బేనర్లో విజయ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చలు నడుస్తున్నాయి.
ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్తో వీరి కలయిక కార్యరూపం దాల్చింది. తాను కూడా రాజుతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఐతే అది ఆలస్యం అయిందని.. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ.. కరోనా టైంలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే రాజే అడ్వాన్స్ రూపంలో సాయం చేసిన విషయాన్ని వెల్లడించాడు విజయ్.
ఇక రాజు బేనర్లో గతంలో తనకు అవకాశం దక్కకపోవడం గురించి విజయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. రాజు నిర్మించిన కేరింత మూవీ ఆడిషన్స్కు తాను హాజరయ్యానని.. కానీ తనకు అవకాశం దక్కలేదని.. అప్పుడు తాను చాలా హర్టయ్యానని.. వీళ్లందరికీ తనేంటో చూపించాలి అని కసిగా అనుకున్నానని.. ఈ విషయం కొన్నేళ్ల కిందటే రాజుతో కూడా చెప్పానని.. కట్ చేస్తే ఇప్పుడు రాజు నిర్మాతగా తాను సినిమా చేశానని విజయ్ తెలిపాడు.
గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆలస్యం కావడం గురించి విజయ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ కోసమే అది లేటైందని.. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, దర్శకుడు గౌతమ్ అర్థం చేసుకోవడం వల్లే ఫ్యామిలీ స్టార్ చేయగలిగానని.. ఈ విషయంలో వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలని.. త్వరలోనే ఆ సినిమా ఉంటుందని విజయ్ చెప్పాడు.
This post was last modified on April 1, 2024 10:41 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…