Movie News

జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ గురించి బోనీ ఏమన్నారు

టాలీవుడ్ లో ఒకేసారి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ తెరంగేట్రం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా నట ప్రయాణం మొదలుపెట్టి ఏళ్ళు గడిచినా తెలుగులో అడుగు పెట్టేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంది. దానికి తగ్గట్టే క్రేజీ ప్రాజెక్టులు వచ్చేలా చేయడంలో తండ్రి కం నిర్మాత బోనీ కపూర్ ఇస్తున్న గైడెన్స్ బాగా ఉపయోగపడుతోంది. గత కొంతకాలంగా జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి ముంబై మీడియాలో బోలెడు కథనాలు వస్తున్నాయి.

ఇద్దరు ఘాడమైన ప్రేమలో ఉన్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని పలు పత్రికలు ఉటంకించాయి. తాజాగా బోనీ కపూర్ దీని గురించి స్పందించాడు. శిఖర్ మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని, తమ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడని, కొంత కాలం జాన్వీతో మాటలు లేనప్పుడు కూడా శిఖర్ తో టచ్ లో ఉన్నానని అంత మంచి కుర్రాడని కితాబు ఇచ్చేశారు. అయితే ఇంతకు మించి రిలేషన్ గురించి మాట్లాడలేదు. లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన శిఖర్ పహారియాకు స్వంతంగా ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కంపెనీ ఉంది. సోదరుడితో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నాడు.

ఈ లెక్కన అనధికారికంగానే బోనీ కపూర్ వీళ్ళ బంధానికి ముద్ర వేసినట్టు అయ్యింది. ఏప్రిల్ 10న అజయ్ దేవగన్ మైదాన్ విడుదల కాబోతున్న సందర్భంగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఈ ప్రస్తావన తేవడంతో ఓపెన్ గా మాట్లాడారు. జాన్వీ కపూర్ కెరీర్ ఇంకా ఊపందుకోవాల్సిన టైంలో పెళ్లి గురించి వార్తలు వస్తే కెరీర్ కు ఇబ్బందనే ఉద్దేశంతో ఆయన నర్మగర్భంగా ఇలా చెప్పొచ్చేమో కానీ జాన్వీ శిఖర్ లు మాత్రం పార్టీలు ఈవెంట్లు కలిసి హాజరైన సందర్భాలు బోలెడున్న మాట వాస్తవం. ఈ ఏడాది దేవర, వచ్చే సంవత్సరం రామ్ చరణ్ 16తో జాన్వీ తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

42 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago