టాలీవుడ్ లో ఒకేసారి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ తెరంగేట్రం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా నట ప్రయాణం మొదలుపెట్టి ఏళ్ళు గడిచినా తెలుగులో అడుగు పెట్టేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంది. దానికి తగ్గట్టే క్రేజీ ప్రాజెక్టులు వచ్చేలా చేయడంలో తండ్రి కం నిర్మాత బోనీ కపూర్ ఇస్తున్న గైడెన్స్ బాగా ఉపయోగపడుతోంది. గత కొంతకాలంగా జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి ముంబై మీడియాలో బోలెడు కథనాలు వస్తున్నాయి.
ఇద్దరు ఘాడమైన ప్రేమలో ఉన్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని పలు పత్రికలు ఉటంకించాయి. తాజాగా బోనీ కపూర్ దీని గురించి స్పందించాడు. శిఖర్ మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని, తమ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడని, కొంత కాలం జాన్వీతో మాటలు లేనప్పుడు కూడా శిఖర్ తో టచ్ లో ఉన్నానని అంత మంచి కుర్రాడని కితాబు ఇచ్చేశారు. అయితే ఇంతకు మించి రిలేషన్ గురించి మాట్లాడలేదు. లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన శిఖర్ పహారియాకు స్వంతంగా ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కంపెనీ ఉంది. సోదరుడితో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నాడు.
ఈ లెక్కన అనధికారికంగానే బోనీ కపూర్ వీళ్ళ బంధానికి ముద్ర వేసినట్టు అయ్యింది. ఏప్రిల్ 10న అజయ్ దేవగన్ మైదాన్ విడుదల కాబోతున్న సందర్భంగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఈ ప్రస్తావన తేవడంతో ఓపెన్ గా మాట్లాడారు. జాన్వీ కపూర్ కెరీర్ ఇంకా ఊపందుకోవాల్సిన టైంలో పెళ్లి గురించి వార్తలు వస్తే కెరీర్ కు ఇబ్బందనే ఉద్దేశంతో ఆయన నర్మగర్భంగా ఇలా చెప్పొచ్చేమో కానీ జాన్వీ శిఖర్ లు మాత్రం పార్టీలు ఈవెంట్లు కలిసి హాజరైన సందర్భాలు బోలెడున్న మాట వాస్తవం. ఈ ఏడాది దేవర, వచ్చే సంవత్సరం రామ్ చరణ్ 16తో జాన్వీ తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది
This post was last modified on April 1, 2024 4:35 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…